New Style Terror Attack Plan: సైలెంట్ గా లేపేసే రిసిన్ పాయిజన్ అంటే ఏంటి? ఉగ్రవాదుల వ్యూహం మారిందా?

ఇప్పటి వరకు ఉగ్రదాడులు అంటే బాంబ్ బ్లాస్ట్ లు, తుపాకీ కాల్పులు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు దారులు మారుస్తున్నారు. కొత్త వ్యూహాలతో దాడులకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి నిదర్శనమే డాక్టర్ హ్యాండ్లర్లు, రిసిన్ పాయిజన్ అటాక్ ప్లాన్.

New Update
risin

తాజాగా గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ హైదరాబాద్ లో ఒక డాక్టర్ తో పాటూ ఇద్దరిని అరెస్ట్ చేశారు. డాక్టర్ సయ్యద్ అహ్మద్ మోహియుద్ధీన్ ను అరెస్ట్ చేశారు. ఇతను హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసు విచారణలో తేలింది. రాజేంద్ర నగర్ సర్కిల్ ఫోర్ట్ వ్య కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్...చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ తరువాత ఆన్ లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పని చేస్తూ ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో పాకిస్తానీహ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రిసిన్ కెమికల్ తో దాడులు చేసేందుకు ప్లాన్ చేశాడు.

సయ్యద్ హైదరాబాద్ లో ఆన్ లైన్ కన్సల్టెంట్ గా ఉంటూ ఉగ్రదాడికి ప్లాన్ చేశాడు. అది కూడా చాలా తెలివిగా. సయ్యద్ ప్లాన్ ప్లాన్విన్నాక, అతని దగ్గర పట్టుబడ్డ వస్తువులు చూశాక పోలీసులకు దిమ్మ తిరిగింది. ఉగ్ర వాదులు దాడులు చేయడంలో వ్యూహాలు మారుస్తున్నారని గ్రహించారు. ఎవ్వరికీ తెలియకుండా వేలల్లో ప్రాణాలు తీసే ఖతర్నాక్ ప్లాన్ లను రెడీ చేస్తున్నారు. డాక్టర్ హ్యాండ్లర్ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ప్రావిన్స్ ( ISKP )తో సంబంధం కలిగి ఉన్నారని ATS తెలిపింది. దొరికిన ముగ్గురు వ్యక్తులూ కలిసి లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో రెక్కీ నిర్వహించినట్లు కూడా దర్యాప్తులో తెలిసింది. ఈ ముగ్గురిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA), భారతీయ న్యాయ సంహిత మరియు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. సయ్యద్‌ను నవంబర్ 17 వరకు ATS కస్టడీలో ఉంచారు.

సైలెంట్ గా ప్రాణాలు తీసే రిసిన్..

సయ్యద్ నుంచి రెండు గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, నాలుగు లీటర్ల కాస్టర్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ATS తెలిపింది. అవికాకుండా మూడు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ జనాలు ప్రాణాలు తీయడానికి వాడాలనుకున్న ఆయుధం రిసీన్ పాయిజన్. ఇదొక జీవ సంబంధమైన టాక్సిన్. అత్యంత విషపూరితమైన రసాయనం. ఇది మానవుని శరీరంలోకి చిన్న మొత్తంలో వెళ్ళినా కూడా హాని చేస్తుంది. శరీర అవయవాలు దెబ్బ తినడం, ప్రాణాలు పోవడం జరుగుతుంది. దీనికి విరుగుడును కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేదు. అందుకే రిసిన్ ను తయారు చేయడం నేరం కింద పరిగణిస్తారు. ఇందులో మరొక అత్యంత ముఖ్యమైన విషయం ఏటంటే..ఈ విషం ఎందులో కలిపినా కనిపెట్టడం చాలా కష్టం. దీనికి రంగు, రుచి, వాసన ఉండదు. ఆఖరుకి మంచి నీళ్ళల్లో కలిపినా కూడా కనుక్కోలేరు. అందుకే ఉగ్రవాదులు దీనిని ఎన్నుకొన్నట్టు తెలుస్తోంది.

వ్యూహం మార్చిన ఉగ్రవాదులు..

ఇప్పటి వరకు బహిరంగంగా దాడులు చేస్తూ వచ్చిన ఉగ్రవాదులు ఇప్పుడు తమ వ్యూహాలను మారుస్తున్నారు. తమ హ్యాండర్లుగా ఎవరికీ అనుమానం రాని డాక్టర్లను పెట్టుకోవడం దగ్గర నుంచీ దాడి చేసే పద్ధతులను మార్చడం వరకు అన్నింటినీ చాలా తెలివిగా ప్రయోగిస్తున్నారు. ఢిల్లీ, ఫరీదాబాద్, హైదరాబాద్..ఈ మూడు చోట్లా నిందితులు డాక్టర్లే. చదువుకున్న వారు ...ముఖ్యంగా వైద్యులు అయితే ఎవరికీ అనుమానం రాదనే ఐడియాతో ఉగ్రసంస్థలు వీరిని హ్యాండ్లర్లుగా, ఆత్మాహుతి బాంబర్లుగా వినియోగిస్తున్నారు. హైదరాబాద్ లో పట్టుబడిన వ్యక్తి కూడా ఒక డాక్టర్. చైనాలో ఎంబీబీఎస్ చదువుకుని వచ్చిన వ్యక్తి.

బాంబు దాడులతో, తుపాకీలతో ఇట్టే అది ఉగ్రవాదుల పని తెలిసిపోతోంది. అందుకే ఇప్పుడు వారు తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. రిసీన్ పాయిజన్ లాంటివి ఉపయోగించడానికి కుట్ర పన్నతున్నారు. ఈ పాయిజన్ ఏ నీటి ట్యాంక్ లో కలిపినా వేలాది మంది ప్రాణాలు ఇట్టే గాల్లో కలిసిపోతాయి. అది కూడా నీళ్ళ ట్యాంకుల దగ్గర పెద్దగా సెక్యూరిటీ కూడా ఉండదు. చాలా సులవైన మార్గం. అలాగే గుళ్ళల్లో ప్రసాదాలు ఇచ్చే ద్గర కూడా సెక్యూరిటీ ఉండదు. అందుకే ఉగ్రవాదులు ఈ పద్ధతిని ఎంచుకున్నారని చెబుతున్నరు. దీన్ని బట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోందని అధికారులు అంటున్నారు.

Also Read: Trump: భారత్ తో అద్భుతమైన సంబంధాలున్నాయ్..త్వరలోనే వాణిజ్య ఒప్పందం ట్రంప్ సూచన

Advertisment
తాజా కథనాలు