Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 22 మంది దుర్మరణం
థాయ్లాండ్లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
థాయ్లాండ్లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
గ్రామంలో కుక్కల బెడద పెరిగితే వాటిని బంధించి ఇతర ప్రాంతాల్లో వదిలేయాల్సిన సర్పంచ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. మానవత్వం మంటగలిసేలా వాటిపై విషప్రయోగం చేయడంతో ఏకంగా 600ల కుక్కలు మృతి చెందాయి.ఈ విషయం బయటకు రావడంతో పలువురు సర్పంచులపై కేసులు నమోదయ్యాయి.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరైన మేడారం జాతర సందర్భంగా ఆదివాసీ పూజారులు నేడు గుడిమెలిగే పండగను నిర్వహించనున్నారు. మేడారంలోని సమ్మక్క పూజామందిరంలో సిద్దబోయిన వంశస్థులు, కన్నెపల్లిలోని సారలమ్మ పూజామందిరంలో కాక వంశీయులు పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ఇరాన్లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వంపై విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి బ్యాంక్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు.
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులను ఉరితీసే చర్యలకు పాల్పడితే అమెరికా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీబీఎస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ట్రంప్ స్పందించారు.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే గుర్తుకు వచ్చేది కోడి పందేలు. కోడిపందేల కోసం ఇప్పటికే బరులు ముస్తాబయ్యాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లను మరిపించేలా ఏర్పాట్లు చేశారు.
అయ్యప్ప మాలదారులు ఎంతో పవిత్రంగా భావించే మకరజ్యోతి దర్శనం ఈ రోజు కానున్నది. దీంతో లక్షలాదిగా శబరికి చేరుకున్న భక్తులతో శబరికొండలు కిటకిటలాడుతున్నాయి. పాదయాత్రగా శబరికి చేరుకుంటున్న భక్తుల అయ్యప్ప నామస్మరణతో పంచగిరులు మార్మోగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్లకు శుభవార్త చెప్పింది. తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రూ. 2,500 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఇన్నాళ్లూ నిధులు లేక.. గ్రామ సమస్యలను తీర్చలేక సతమతవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్యను తీర్చనుంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల అభివృద్ధి, ఇతర అవసరాల కోసం ఏకంగా రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.