/rtv/media/media_files/2026/01/14/at-least-22-people-killed-when-crane-falls-on-train-in-northeast-thailand-2026-01-14-14-37-30.jpg)
At least 22 people killed when crane falls on train in northeast Thailand
థాయ్లాండ్లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సిఖియో జిల్లాలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు కొనసాగుతుండగా ఓ క్రేన్ కంట్రోల్ తప్పి కిందపడిపోయింది. అదే సమయంలో కింద పట్టాలపై ప్యాసెంజర్ రైలు వెళ్తుండగా దానిపైనే క్రేన్ పడింది.
Also Read: నేడు మకరజ్యోతి దర్శనం..అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరి
దీంతో ఆ రైలు బోగీలు పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 22 మంది మృతి చెందారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రైలుకు మూడు బోగీలు ఉండగా చివరి రెండు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఈ రైలులో 195 మంది ప్రయాణికులు ప్రయణిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
BREAKING NEWS: Deadly Thailand rail accident. A tragic rail accident in Thailand has left at least 22 dead after a construction crane collapsed onto a moving train carriage. Around 80 people were injured in the crash, including a one-year-old, the youngest among the wounded. pic.twitter.com/jS0oQWa5RH
— Jeab (@Jeab1030599) January 14, 2026
Follow Us