Sankranti Cockfights : కోడి పందేలకు సర్వసిద్ధం...ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల ను తలపించేలా...

సంక్రాంతి పండుగ వచ్చిందంటే గుర్తుకు వచ్చేది కోడి పందేలు. కోడిపందేల కోసం ఇప్పటికే బరులు ముస్తాబయ్యాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు తదితర  జిల్లాల్లో ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను మరిపించేలా ఏర్పాట్లు చేశారు.

New Update
FotoJet - 2026-01-14T112935.163

 Sankranti Cockfights

 Sankranti Cockfights :  సంక్రాంతి పండుగ వచ్చిందంటే గుర్తుకు వచ్చేది కోడి పందేలు. కాగా ఏపీలో పెద్ద ఎత్తున  నిర్వహించే కోడిపందేల కోసం ఇప్పటికే బరులు ముస్తాబయ్యాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు తదితర  జిల్లాల్లో ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను మరిపించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు వాటి స్థాయిని బట్టి బరుల స్థాయికి అనుగుణంగా డ్రోన్లతో పర్యవేక్షణ, వీఐపీ, వీవీఐపీ లాంజ్‌లు, డిజిటల్‌ తెరలు, ఫ్లడ్‌లైట్ల వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏలూరు సమీపాన దుగ్గిరాల, మీర్జాపురం, భీమవరం, ఉండి, సీసలి ప్రాంతాల్లో అతిపెద్ద బరులు ఏర్పాటు అయ్యాయి. కోడి పందేలకు తోడు ఇక్కడకు వచ్చే ప్రముఖులకు చికెన్, మటన్, రొయ్యలతో పాటు గోదావరి ప్రత్యేక వంటకాలు రుచి చూపించటానికి ఆయా ప్రాంతాల్లో ప్రసిద్ధికెక్కిన వంట మాస్టర్లను రప్పించారు.

FotoJet - 2026-01-14T113013.064

వీవీఐపీలు సేద తీరడానికి కారవాన్లు, కంటెయినర్లు కూడా  సిద్ధం చేశారు. ఈ సంక్రాంతి సీజన్‌లో మొదటిసారిగా క్యారవాన్స్‌ను కూడా సిద్ధం చేశారు. కృష్ణా-ఏలూరు జిల్లాల మధ్యన గన్నవరం, నూజివీడుల సరిహద్దున బిళ్ళనపల్లి, మీర్జాపురంల వద్ద ఏర్పాటు చేస్తున్న టెక్‌ కోడి పందేలకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచి వీవీఐపీలు వస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు వస్తున్నారు. ఇప్పటికే వీరికోసం ఏసీ గ్లాస్‌ గ్యాలరీలను ఏర్పాటు చేశారు.బరుల్లో కోడి పందేలు, గుండాట, కోతాట, ఇతర జూద ఆటలకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. చాలా బరుల్లో జనాలను నియంత్రించడానికి ప్రత్యేక పాస్‌లు, బౌన్సర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.  

FotoJet - 2026-01-14T113001.108

 బుధవారం భోగితో సంక్రాంతి సంబరాలతో పాటు కోడి పందేలూ మొదలవుతున్నాయి. సంప్రదాయం పేరుతో సంక్రాంతి మూడు రోజులూ యథేచ్ఛగా కోడి పందేలు ఆడటానికి రంగం సిద్ధమైంది. పెద్ద ఎత్తున బరులు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు. కోడి పందేలతో పాటు అదే సమయంలో గుండాటలు, పేకాటలూ జోరుగా జరగనున్నాయి. కోడిపందేలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు ఇప్పటికే ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలకు చేరుకున్నారు. విజయవాడలో మొత్తం హోటళ్లు, లాడ్జీలు నిండిపోయాయి. ఏకంగా 5 వేల గదులను బుక్‌ చేసుకోవడం గమనార్హం. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు ఇక్కడ బస చేసి, కోడి పందేలు చూసేందుకు ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సీజన్‌లో ఎన్టీఆర్‌-ఏలూరు జిల్లా సరిహద్దున వీవీఐపీల కోసం ఏకంగా క్యారవాన్స్‌ ఏర్పాటు చేయడం ప్రత్యేకత. పలు ప్రాంతాల్లో విజేతలకు అందజేసేందుకు కార్లు, బుల్లెట్లు, బైకులు సిద్ధం చేయడం గమనార్హం.

FotoJet - 2026-01-14T113033.952

 కొన్ని చోట్ల ముహూర్తం పేరుతో మంగళవారమే పందేలను లాంఛనంగా ప్రారంభించారు. బాపట్ల జిల్లాలో మంగళవారమే సంక్రాంతి సందడి మొదలైంది. చుట్టుపక్కల జిల్లాలతోపాటు తెలంగాణ నుంచి కూడా వేలాది మంది తరలివచ్చి లక్షల్లో పందేలు కాశారు. జిల్లాలోని అధికార పార్టీ ప్రధాన నేత ఆధ్వర్యంలో పది బరులు ఏర్పాటు చేశారు. వాటి సమీపంలోనే పేకాట, కోతముక్క, గుండాట, నంబర్ల ఆటలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో రూ.10వేలు, రూ.20వేలు, రూ.50వేలు, రూ.లక్ష విభాగాల్లో ప్రత్యేక బరులు ఏర్పాటు చేశారు. వీఐపీ బరుల్లో లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పందేలు నిర్వహించారు. మహిళలు సైతం భారీగా తరలివచ్చారు. బరుల వద్దే ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

FotoJet - 2026-01-14T112946.153

 కోనసీమలో వందకు పైగా బరులు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఐ.పోలవరం మండలం మురమళ్లలోని సువిశాలమై ప్రాంతంలో జిల్లాలోనే అతిపెద్ద వీఐపీ బరిని ఏర్పాటు చేశారు.  ఇక్కడకు వచ్చే అతిథులు, పందెంరాయుళ్లకు సకల సౌకర్యాలు కల్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చిన్నాపెద్దా కలిపి ఒక్కో బరిలో రోజుకు కోడి పందేలు, గుండాట కలిపి రూ. 15 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయని అంచనా. మురమళ్లలో రోజుకు రూ. 2 కోట్ల వరకు లావాదేవీలు జరగనున్నాయి. కాకినాడ రూరల్‌, తుని, సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురంలో అత్యధిక పందేలు గెలిచిన వారికి బుల్లెట్లు, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వబోతున్నారు. కరప మండలంలో మూడు రోజుల పందేల విజేతకు ఇన్నోవా కారు అందించనున్నట్టు ప్రకటించారు. వెరసి ఉమ్మడి జిల్లాలో భోగి రోజు కోడి పందేలు, గుండాటల్లో రూ. 70 కోట్లు చేతులు మారతాయని భావిస్తున్నారు.


విజయవాడలో అన్ని స్టార్‌ హోటళ్లు, లాడ్జీలు నిండిపోయాయి. మొత్తం 15 స్టార్‌ హోటళ్లు, 80 లాడ్జీలలో మొత్తం 5 వేల గదులు నిండిపోయినట్లు తెలుస్తోంది. గదులన్నీ వారం రోజుల వరకు బుక్‌ చేసుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడలో వసతి ఏర్పాటు చేసుకుని సందర్శకులు గుడివాడ, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో జరిగే కోడిపందేలను చూడటానికి వెళ్తారు. కొంతమంది ఏలూరు జిల్లా మీర్జాపురంలో ఏర్పాటు చేసిన హైటెక్‌ కోడిపందేల శిబిరం వద్దకు, మరికొంతమంది భీమవరంలో జరిగే బరుల వద్దకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతి సీజన్‌లో మొదటిసారిగా క్యారవాన్స్‌ను కూడా సిద్ధం చేశారు.

13elr501-600791_mr-1768354628-0

కృష్ణా-ఏలూరు జిల్లాల మధ్యన గన్నవరం, నూజివీడుల సరిహద్దున బిళ్ళనపల్లి, మీర్జాపురంల వద్ద ఏర్పాటు చేస్తున్న టెక్‌ కోడి పందేలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వీవీఐపీలు వస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు వస్తున్నారు. ఇప్పటికే వీరికోసం ఏసీ గ్లాస్‌ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. విజయవాడ, హనుమాన్‌ జంక్షన్‌, ఏలూరు, నూజివీడు, గన్నవరంలో హోటల్స్‌ అన్నింటినీ వీరి కోసం బుక్‌ చేశారు. పోటీలు జరిగే రోజున అక్కడే విశ్రాంతి తీసుకోవటానికి నిర్వాహకులు క్యారవాన్స్‌ రప్పించారు. మంగళవారం సాయంత్రానికి నాలుగు రాగా, అర్ధరాత్రికి మరో ఆరు వరకు రానున్నాయి. రూ.కోట్లలో పందేలు కాస్తుండటంతో.. అతిథులకు ఆ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ పందేలు కొట్టేవారికి థార్‌, బ్రెజా కార్లను కూడా ఇస్తున్నారు. వీటిని భోగి రోజున బరులకు తీసుకువస్తారు. రామన్నగూడెం, సింగన్నగూడేలలో పందేల నిర్వాహకులు విజేతలకు బైక్‌లు ఇస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు