🔴Live Breakings: ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
జనసేన 12వ ఆవిర్భవ దినోత్సవ సభ పిఠాపురంలో జరుగుతుంది. 2014 మార్చి 14 పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించాడు. ఒంటరిగా పోటీ చేసి 2019లో 175 స్థానాల్లో పోటీ చేస్తే ఒకే సీటు గెలిచింది. TDPతో పొత్తు పెట్టుకొని 2024లో 21 సీట్లు గెలిచింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా MLC స్థానాలకు నిర్వహించిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. జనసేన నుంచి నాగబాబు, BJP నుంచి సోము వీర్రాజు, TDP నుంచి రవిచంద్ర, గ్రీష్మ, బీటీ నాయుడు ఎన్నికయ్యారు.
పెరియార్పై విమర్శలు చేసిన నిర్మలాసీతారామన్కు TVK అధ్యక్షుడు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిర్మలమ్మ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భాష విషయంలో నిజంగా బాధపడి ఉంటే త్రిభాషా సూత్రాన్ని రుద్దడం ఆపేస్తారా? అని ప్రశ్నించారు.
అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ MLCలుగా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు వీరికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వీరి ఐదు నామినేషన్లు మాత్రం రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. సభ మన అందరిది, సభ మీ ఒక్కరిది కాదంటూ ఈ రోజు జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో నాగం సొంత గూటికి చేరుతారా? అన్న చర్చ మొదలైంది. అయితే.. వీరి మధ్య అలాంటి అంశాలు చర్చకు రాలేదని తెలుస్తోంది.
తెలంగాణలో తాను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదన్నారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. నిరుద్యోగ రేటును 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించామన్నారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.