/rtv/media/media_files/2025/06/02/9vExCZVtKyVCFEQe1woe.jpg)
'Operation National Park' Indinan Police force search for Maoists
Operation National Park: వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ సేఫ్ జోనుకు తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్,- మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్పార్క్వైపు తరలివెళ్తున్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో కేంద్ర సాయుధ బలగాలు అభయారణ్యం టార్గెట్గా ఆపరేషన్ మొదలుపెట్టినట్లు సమాచారం.
మావోయిస్టులకు రహస్య స్థావరం..
ఈ మేరకు ఛత్తీస్గఢ్,- మహారాష్ట్ర సరిహద్దులను విడదీసే ఇంద్రావతి నదిని ఆనుకొనివున్న ఈ నేషనల్ పార్క్ చాలా దట్టమైన అడవిగా పేరుగాంచింది. కొంతకాలంగా మావోయిస్టులకు రహస్య స్థావరంగా కొనసాగుతోంది. దీంతో దండకారణ్యం పోలీసులు పైచేయి సాధించగా మావోయిస్టు అగ్రనేతలంగా నేషనల్ పార్క్ లో తలదాచుకున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. నంబాల కేశవరావు మరణంతో నాయకత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోలు.. అక్కడకు చేరుకుంటున్నారనే సమాచారంతో నేషనల్ పార్క్ అడవులను జల్లెడ పట్టడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Pineapple: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్ను పాడు చేస్తుందా?
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు 2,800 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పార్క్ అడవులను మావోయిస్టులు కంచుకోటగా భావిస్తున్నారు. బీజాపుర్ జిల్లా నుంచి ఇంద్రావతి నది మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో నేషనల్ పార్క్ అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కర్రెగుట్టల ఆపరేషన్, దండకారణ్యంలోనూ హిడ్మా వంటి అగ్రనేతల జాగ కానరాకపోవడంతో వారంతా నేషనల్ పార్క్ అడవుల్లోకి వెళ్లి ఉంటారని కేంద్ర బలగాలు అనుమానిస్తున్నాయి.