BIG BREAKING: కేసీఆర్, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు

ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పటి కంటే.. గత పదేళ్లలోనే ఏపీ ఎక్కువగా నీళ్లు ఎత్తుకుపోయిందని మంత్రి ఉత్తమ్ రెడ్డి ఆరోపించారు. నాటి సీఎం KCR, మంత్రి హరీష్ ఏపీ కోసమే పని చేశారని ధ్వజమెత్తారు. నీటిని తరలించుకుపోయేందుకు జగన్-కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు.

New Update
KCR Harish Rao Uttam Kumar reddy

KCR Harish Rao Uttam Kumar reddy

పదేళ్లలో కేసీఆర్, హరీష్ రావు ఏపీ కోసమే పని చేశారని మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. మన నీటిని ఏపీ దోచుకునేందుకు సహకరించారని ధ్వజమెత్తారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణకు నష్టం చేసే ముచ్చుమర్రి ప్రాజెక్ట్ పనులను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణకు మరణశాసనమన్నారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా నిత్యం 3 టీఎంసీల నీటిని తరలించేందుకు కేసీఆర్ సర్కార్ సహకరించింది నిజమన్నారు. జగన్ తో అలయ్ బలయ్ చేసుకుని.. కృష్ణా నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారని ఫైర్ అయ్యారు.

Also Read :  వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

Also Read :  ఇకపై కీప్యాడ్ ఫోన్లలోనూ ఫోన్‌పే.. కంపెనీ అదిరిపోయే ఫీచర్!

కేసీఆర్ సమయంలోనే భారీ దోపిడి..

ఉమ్మడి ఏపీ ఉన్న సమయంలో కన్నా ముచ్చుమర్రి, మల్యాలలో పదేళ్ల కేసీఆర్ హయాంలోనే ఎక్కువగా నీటిని తరలించారని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యేవరకు.. తెలంగాణ కావాలనే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్ళలేదన్నారు. జగన్-కేసీఆర్ రహస్యం ఒప్పందం లో భాగంగానే.. తెలంగాణ అపెక్స్ మీటింగ్ కు పోలేదన్నారు. బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు తమ పేర్లను గోబెల్స్ రావు మార్చుకుంటే సరిపోతుందన్నారు. గోబెల్స్ బతికి ఉంటే.. వీళ్లను చూసి ఆశ్చర్యపోయేవారన్నారు. 

Also Read :  ఇంట్లోనే తయారు చేసుకునే ఫేషియల్ స్క్రబ్స్.. దెబ్బకి టాన్ వదులుతుంది

Also Read :  పోర్న్ చూస్తున్న వారికి బిగ్ షాక్.. HYDలో ఐదుగురు అరెస్ట్!

 

telugu-news | telugu breaking news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | telangana-politics

Advertisment
Advertisment
తాజా కథనాలు