Raja singh: నన్ను గెలికితే మీ బాగోతాలన్నీ బయటపెడతా.. రాజాసింగ్ సంచలనం!

పార్టీ అధిష్ఠానం నోటీసులు ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. తనను సస్పెండ్‌ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచుతానని హెచ్చరించాడు.

New Update
raja singh MLA

raja singh MLA

Raja singh:నోటీసులు ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. తనను పార్టీ అధిష్ఠానం సస్పెండ్‌ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచుతానని హెచ్చరించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

బీజేపీలో ఇంటిదొంగలంటూ..

ఈ మేరకు రాజాసింగ్ కు బీజేపీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల సొంత పార్టీ నాయకులపై గోషామహల్ ఎమ్మె్ల్యే ఆగ్రహంతో ఉగిపోయారు. బీజేపీలో ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారని మండిపడ్డారు. కరీంనగర్ నుంచి తనపై వార్ స్టార్ట్ అయ్యిందని రాజాసింగ్ ఆరోపించారు. పరోక్షంగా ఆయన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ని టార్గెట్ చేసిన కామెంట్స్ చేశారు. గతంలో కూడా బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులపై షాకింగ్ ఆరోపణలు చేశారు ఆయన. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో ఆయనకు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ కు నోటీసుల అంశం తెరపైకొచ్చింది.

ఇది కూడా చూడండి: Pineapple: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

మరోవైపు ఎమ్మెల్యే రాజా సింగ్ కు మంగళహాట్ పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం సెక్యూరిటీతో మాత్రమే బయటికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాజాసింగ్ భద్రత దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తో పాటు 1+4 భద్రతను కేటాయించింది. అయితే రాజాసింగ్ తమ సూచనలను పట్టించుకోవడంలేదని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించడం లేదని పోలీసులు చెబుతున్నారు. సెక్యూరిటీ లేకుండానే ఆయన బయటకు వస్తున్నారని అంటున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు