🔴Live News Updates: యాదాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తెలుగు దేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం అమరావతిలో నిర్వహించారు. దీనికి మొత్తం 15మంది ఎమ్మెల్యేలు హాజరు కావడంతో సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇలా దూరంగా ఉండటం సరికాదని వార్నింగ్ ఇచ్చారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ 171 దుర్ఘటన కేసులో కుట్ర కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల ఆకాంక్షలను తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో తానే నెంబర్ 1 అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు మంచి మనసు ఉందని, అన్నీ మంచి పనులే చేస్తానన్నారు. చిన్నప్పటినుంచి కష్టపడే తత్వం ఉందన్నారు.
పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో భారత్ హస్తం ఉందనే వాదనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉత్తర వజీరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది పాక్ సైనికులు మృతి చెందారు.
కాంగ్రెస్ నేతలంటే తనకు గౌరవం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీరియస్గా తీసుకోవద్దని కొండా మురళి కోరారు. తాను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు.