/rtv/media/media_files/2025/04/13/FAtxjxTUHZeeYt0oWZb2.jpg)
Union Govt and CPI Maoist Party
Maoist: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 13 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలున్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.23 లక్షల రివార్డు ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
ఇదిలా ఉంటే.. ఛత్తీస్గఢ్లోని నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు(Female Maoists) మృతి చెందారు. అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్ సీనియర్ కేడర్ అబూజ్మడ్ ఉన్నారని సమాచారం రావడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ నారాయణపుర్, కొండగావ్ ఎస్టీఎఫ్ కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా పరిధిలోని పర్సేఘడ్ లో నలుగురు మావోయిస్టులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో మావోయిస్టు నేతలు సంజయ్ కొర్రామ్, సంతోష్ కుమార్, సురేష్, మనోజ్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా అరెస్ట్ అయిన మావోయిస్టులపై గతంలో రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.