/rtv/media/media_files/ot8kMboXt8zlgnChyhUd.jpg)
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల ఆకాంక్షలను తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.
Also Read : ఈ ఒక్క రోజే అదిరిపోయే ఆఫర్.. ఫ్లైట్ టికెట్ కేవలం రూ.1,499 మాత్రమే!
విధ్వంసం నుంచి వికాసం వైపు..
'అది మన బాధ్యత. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. భవిష్యత్తులో ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాలి. ఎన్నికల్లో దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశాం. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ మనది. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని పరిపాలన చేశాం. చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యం. రాష్ట్ర విభజన వేళ అనేక సమస్యలు వచ్చినా నిలదొక్కుకున్నాం. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ధ్వంసమైంది. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ప్రజలకు చెప్పాం. వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్లలో మనం ఏం చేయాలనేదానిపై ఇప్పటికే చర్చించాం. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మనం ఎప్పుడూ చేయం. కేంద్రం మనకు బాగా సాయం చేస్తోంది. సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పడం లేదు. ఇంకా చాలా పరిష్కరించాలి.. అదే మన లక్ష్యం' అన్నారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
ఇక సేవ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నామని, పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామన్నారు. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నాం. వాట్సప్ గవర్నెన్స్తో సుమారు 500 సేవలు ఆన్లైన్లో అందిస్తున్నాం. ఆగస్టు 15 నాటికి 701 సర్వీసులు ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు
Also Read : వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!
AP CM Chandrababu | jagan | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | andhra-pradesh-politics