నా మాటలు సీరియస్‌గా తీసుకోవద్దు.. వారిపై గౌరవం ఉంది: కొండా మురళి!

కాంగ్రెస్‌ నేతలంటే తనకు గౌరవం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీరియస్‌గా తీసుకోవద్దని కొండా మురళి కోరారు. తాను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు.

New Update
konda mrl

కాంగ్రెస్‌ నేతలంటే తనకు గౌరవం ఉందని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు నేతలు సీరియస్‌గా తీసుకోవద్దని కొండా మురళి కోరారు. తాను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసన్నారు.వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా కొండా కామెంట్స్ పై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శనివారం గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు మురళి హాజరయ్యారు. గాంధీభవన్‌కు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవికి ఆరు పేజీల లేఖను అందించారు. 

ఈ మేరకు కొండా మురళి మాట్లాడుతూ.. ‘నా మాటలపై మల్లు రవికి వివరణ ఇచ్చాను. కాంగ్రెస్‌ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరాను. రేవంత్‌ రెడ్డి మళ్లీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రాహుల్‌ గాంధీని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉంది’ అని చెప్పారు. మేం నోటీసు ఇస్తే కొండా మురళి వచ్చారు. ఆయన మాకు వివరణ ఇచ్చారు. రాతపూర్వకంగా కూడా వివరణ ఇచ్చారని మల్లు రవి తెలిపారు.

ఇది కూడా చూడండి: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు