Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో కుట్రకోణం.. కేంద్రం దర్యాప్తు!

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ 171 దుర్ఘటన కేసులో కుట్ర కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు.

New Update
Ahmedabad plane crash death toll rises to 274 Air India Plane Crash

Ahmedabad plane crash death toll rises to 274 Air India Plane Crash

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ 171 దుర్ఘటన కేసులో కుట్ర కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు. ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) ఈ కేసును పరిశీలిస్తోందని చెప్పారు. ఏఏఐబీ ఆధీనంలోవున్న బ్లాక్‌బాక్స్‌ విశ్లేషణ కోసం దానిని విదేశాలకు పంపించబోతున్నట్లు వెల్లడించారు. 

Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు

Ahmedabad Plane Crash

ఈ మేరకు పుణెలో జరుగుతున్న ఓ కాన్‌క్లేవ్‌లో దీని గురించి స్పందించిన మురళీధర్.. ‘విషాద ఘటనపై ఏఏఐబీ పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టింది.  అన్ని కోణాలను పరిశీలిస్తున్నాం. కుట్ర ఏదైనా ఉందా? అనే అంశంపై కూడా దృష్టిపెట్టాం. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నాం. చాలా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలం కావడం ఎన్నడూ జరగలేదు. ఇది అరుదైన కేసు. దర్యాప్తు నివేదిక వస్తేనే రెండు ఇంజిన్లు విఫలం అయ్యాయా? లేక ఇంధన సరఫరాలో సమస్య ఉందా అనేది బయటపడుతుంది. బ్లాక్‌ బాక్స్‌లోని కాక్‌పీట్‌ వాయిస్‌ రికార్డర్‌లో పైలట్ల సంభాషణ రికార్డైంది.  నివేదిక 3 నెలల్లో వస్తుంది. ఇప్పుడే దానిపై ఏం చెప్పలేం' అన్నారు.

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు 

ఇక ఇప్పుడు ప్రజలు భయపడటం లేదని, సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. డీజీసీఏ 419 సాంకేతిక సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంపై పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు