TG News: చలో సచివాలయం.. నిరుద్యోగుల కోసం హరీష్రావు పిలుపు!
నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు.
TG News: నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. కానీ రేవంత్ సర్కార్ ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయట్లేదంటూ విమర్శలు గుప్పించారు. ఇక చలో సచివాలయం కార్యక్రమానికి మద్దతివ్వాలని నిరుద్యోగ యువత కోరుతున్నారని, యువతతో కలిసి త్వరలోనే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
'బీఆర్ఎస్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలిచ్చాం. కాంగ్రెస్ దగా క్యాలెండర్తో నిరుద్యోగ యువతను మోసం చేసింది. నోటిఫికేషన్లు వద్దని యువత ధర్నాలు చేస్తున్నారని రేవంత్రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. బాధ్యత లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతాం. కమీషన్లు రావని రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదా?’ అంటూ మండిపడ్డారు.
ఇక 20 నెలలు గడుస్తున్న రేవంత్ ప్రభుత్వం క్యాలెండర్పై ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. ఈ విషయంలో గాంధీల కుటుంబ గౌరవం, పరువు పోతోందని ప్రియాంక, సీఎం రేవంత్కు రెండు మొట్టికాయలు వేసి అడగాలని డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్లో ఐదు అంశాలు చెప్పారన్నారు. అందులో ఏ ఒక్కటి అమలు కాలేదని ఆక్షేపించారు. అమరుల కుటుంబాలకు నెలకు రూ.25 పెన్షన్, ఉద్యోగం అన్నారని, అందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తొలి యేడులోని ఇస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు.
TG News: చలో సచివాలయం.. నిరుద్యోగుల కోసం హరీష్రావు పిలుపు!
నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు.
Harish Rao
TG News: నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. కానీ రేవంత్ సర్కార్ ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయట్లేదంటూ విమర్శలు గుప్పించారు. ఇక చలో సచివాలయం కార్యక్రమానికి మద్దతివ్వాలని నిరుద్యోగ యువత కోరుతున్నారని, యువతతో కలిసి త్వరలోనే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
'బీఆర్ఎస్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలిచ్చాం. కాంగ్రెస్ దగా క్యాలెండర్తో నిరుద్యోగ యువతను మోసం చేసింది. నోటిఫికేషన్లు వద్దని యువత ధర్నాలు చేస్తున్నారని రేవంత్రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. బాధ్యత లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతాం. కమీషన్లు రావని రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదా?’ అంటూ మండిపడ్డారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
ఇక 20 నెలలు గడుస్తున్న రేవంత్ ప్రభుత్వం క్యాలెండర్పై ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. ఈ విషయంలో గాంధీల కుటుంబ గౌరవం, పరువు పోతోందని ప్రియాంక, సీఎం రేవంత్కు రెండు మొట్టికాయలు వేసి అడగాలని డిమాండ్ చేశారు. యూత్ డిక్లరేషన్లో ఐదు అంశాలు చెప్పారన్నారు. అందులో ఏ ఒక్కటి అమలు కాలేదని ఆక్షేపించారు. అమరుల కుటుంబాలకు నెలకు రూ.25 పెన్షన్, ఉద్యోగం అన్నారని, అందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తొలి యేడులోని ఇస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు.