🔴IPL 2025 SRH vs MI Live Score: ముంబయి ఇండియన్స్ విజయలక్ష్యం 163
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఓ నాస్తికుడని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అప్పట్లోనే రాడికల్ సంస్థ పెట్టి, విప్లవ సంస్థలో పని చేశాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే సందర్భంగా ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఆధ్వర్యంలో ఈ రోజు నేతలు ముందస్తుగా వేడుకలు నిర్వహించారు. కుమారుడు నారా లోకేష్, సతీమణి భువనేశ్వరి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు, ఎంపీలతో కలిసి చంద్రబాబు కేక్ కట్ చేశారు.
రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే అధికారులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని BRS నేత కేటీఆర్ ప్రకటించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే కంచె గచ్చిబౌలి భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కమిటీ తాము చెప్పిన విషయాలను కరెక్ట్ అని చెప్పిందన్నారు.
పాస్టర్ ప్రవీణ్ మృతి విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకుని వెళ్లానని KA పాల్ తెలిపారు. న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానన్నారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు లేఖ రాశారు. ప్రజా పాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. విజయవాడలోని సీపీ ఆఫీస్ విజయసాయిని సిట్ విచారించనుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోల విషయంలో తనపై కేసు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం ఉందన్నారు. ఎంఐఎంను కంట్రోల్ చేస్తామన్నారు.