Ys Sharmila: మోదీ తీరు చిచ్చుబుడ్డి తుస్సుమన్నట్లు ఉంది.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్‌ షర్మిల ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మోదీ తీరు చూస్తే.. చిచ్చు బుడ్డి తుస్సుమన్నట్లు ఉందని సోషల్ మీడియాలో ట్విట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపింది.

New Update
Ys Sharmila

Ys Sharmila

ప్రధాని మోదీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది. మోదీ తీరు చూస్తే.. చిచ్చు బుడ్డి తుస్సుమన్నట్లు ఉందని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నూతన రాజధాని నిర్మాణ మొత్తం బాధ్యత అంతా కూడా కేంద్ర ప్రభుత్వానిదే. కొత్త రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన మొత్తం కూడా కేంద్రం కల్పించి ఇవ్వాలి. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ మనకు ఇస్తున్నది ఏమిటి ? ఆనాడు 2015లో మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్లారని ఆమె తెలిపారు.  

ఇది కూడా చూడండి: Hyderabad School Buses: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం ఎందుకు కాలేదు..

10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి మోదీ ఘరానా మోసం చేశారన్నారు. మళ్లీ అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతామంటూ.. బూటకపు మాటలు చెప్పారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారు. అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు ? అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా ? ఏపీ రాజధాని నిర్మాణం మొత్తం కూడా కేంద్రం బాధ్యతేనా అని హామీ ఇచ్చారా అని అన్నారు.

ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా? పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా?  చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని షర్మిల అన్నారు. మోదీని నమ్మి మళ్లీ మళ్లీ మోసపోతున్నట్లు తెలుసుకోవాలని షర్మిల తెలిపారు. ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి ఒకసారి గోతిలో పడ్డ చంద్రబాబు.. మళ్లీ మోదీని పిలిచి అదే గోతిలో పడ్డారని ఆమె అన్నారు. 

ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

సీఎం చంద్రబాబు నాయుడికి షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు.. నిధులు.. కానీ ఏపీ రాష్ట్రానికి ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ఇప్పుడు జీతాలు ఇవ్వాలంటే అప్పు తీసుకోకపోతే కుదరదని మళ్లీ మళ్లీ ఎవరిని అడిగి రూ.60 వేల కోట్లు అప్పు తెస్తున్నారని షర్మిల అన్నారు. వడ్డీల భారం మోయడం ఎలా? వరల్డ్ బ్యాంక్, ADB, KFW, హడ్కోల దగ్గర ఏపీ రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు మొత్తం ప్రజలపై ఎందుకు భారం మోపుతున్నారని, సీఎం చంద్రబాబు తప్పకుండా సమాధానం చెప్పాలని షర్మిల సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. 

ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!

 

pm modi | chandrababu | capital | ys-sharmila | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు