/rtv/media/media_files/2025/05/03/Kxi4xtvBr8lFPmFFdP6G.jpg)
Hyderabad Theft Incident
Hyderabad Theft Incident: హైదరాబాద్ శివార్లలోని వారాసిగూడ పరిధిలోని పార్సిగుట్టలో(parsigutta) ఓ దొంగతన ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి, విలువైన బంగారాన్ని దొంగిలించారు.
వివరాల్లోకి వెళ్తే పార్సిగుట్టలో నివసిస్తున్న పారిజాతం అనే వృద్ధురాలు, ఇల్లు అద్దెకు ఇవ్వడం కోసం తన ఇంటి ముందూ 'టూ లెట్' బోర్డు పెట్టింది. అయితే, 'టూ లెట్' బోర్డు చూసి అద్దెకు ఇల్లు కోసం వచ్చామని చెప్పి ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో వృద్ధురాలు మాత్రమే ఉన్నట్టు గమనించిన దుండగులు, ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి తాళ్లతో కట్టేశారు. నోటికి టేప్ ప్లాస్టర్ వేసి, కదలకుండా చేశారు.
అనంతరం కత్తితో బెదిరించి, ఆమె వద్ద ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు, సుమారు రూ.6,000 నగదు, మొబైల్ ఫోన్ను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. నిందితుల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి దొంగతనాలు పట్టపగలే జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా అంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ఇదిలా ఉండగా, హైదరాబాద్ మధురానగర్ లో(Madhura Nagar) నది రోడ్డుపై భర్త కళ్ల ముందే ఓ వివాహిత పట్ల ముగ్గురు కామాంధులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డు పై కామాంధులు రెచ్చిపోయారు. "నన్నే నీ మొగుడు అనుకో, నంబర్ ఇవ్వు" అంటూ కట్టుకున్న భర్త ముందే అసభ్యంగా ప్రవర్తించారు. బీరు బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహ్మత్ నగర్ వరకూ వెనుకపడుతూ వేధింపులకు పాల్పడ్డారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్, ఒంగోలుకు చెందిన 29 ఏళ్ల మహిళ తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి హైదరాబాద్లోని రహ్మత్ నగర్కు బంధువుల ఇంటికి వెళ్లారు. వీరంతా కలిసి గురువారం సాయంత్రం బేగంపేటలోని క్లబ్ - 8 పబ్కు వెళ్లి రాత్రి సుమారు 11:40 గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరారు.
అయితే, పబ్ నుండి బయటకు వస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను గమనించి వెంటాడారు. భర్తతో కలిసి వస్తున్నానని చెప్పినా, వారిలో ఒకడు "నన్నే నీ భర్త అనుకో, నంబర్ ఇవ్వు" అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. బీరు బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహ్మత్ నగర్ వరకూ వారి వెనుకపడుతూ వేధింపులకు పాల్పడ్డారు.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్లో టెన్షన్ టెన్షన్..!
ఈ క్రమంలో భర్త తన భార్యను ఇంటికి చేర్చి స్నేహితుడిని డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. అయితే ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో మళ్లీ అదే ముగ్గురు యువకులు దాడికి దిగారు. వారు ప్రయాణిస్తున్న బైక్ ను అడ్డగించి, ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. వెంటనే బాధితులు డయల్ 100 సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా, స్పందించిన మధురానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. పంజాగుట్టకు చెందిన సంపత్ (28), సందీప్ (28), కూకట్పల్లికి చెందిన ఉమేష్ (28). వీరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ఇలాంటి ఘటనలు భాగ్యనగర భద్రతపై ప్రశ్నలు కలిగిస్తుండగా, మహిళల రక్షణ కోసం మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని బాధితులు పోలీసు వారిని కోరారు.