Kuppam: కుప్పంలో చంద్రబాబు ఫ్యామిలీ గృహ ప్రవేశం - PHOTOS
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుకలు కుప్పంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుకలు కుప్పంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని తెలుస్తోంది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్ట్ సర్జరీ తర్వాత నాని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్పై హీరోలు మాట్లాడట్లేదనే విమర్శలపై పవన్ స్పందించారు. 'సెలబ్రిటీలు దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. కేవలం ఎంటర్టైన్ చేసే గుడ్ పెర్ఫార్మర్స్ మాత్రమే. అంతకు మించి సినీ సెలబ్రిటీల నుంచి దేశ భక్తిని ఆశించొద్దు' అని చెప్పారు.
ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు.
ఏపీ పేదలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని మే నెలాఖరులోగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మే 18 తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలూ వేయాలని అధికారులకు సూచించారు.
ఏపీలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా హెచ్చరించింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్ష సూచన ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మూలపాడు వద్ద కూలీలతో రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోను బొలెరో ఢి కొట్టింది. ఇద్దరు మహిళలు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
వైఎస్ షర్మిల ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మోదీ తీరు చూస్తే.. చిచ్చు బుడ్డి తుస్సుమన్నట్లు ఉందని సోషల్ మీడియాలో ట్విట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపింది.
నంద్యాల జిల్లా ఆత్మకూరలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మరో పదిరోజుల్లో పెళ్లనగా వరుడు నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చి వస్తుండగా .. అతడి బైక్ ని బొలెరో వాహనం ఢీకొట్టింది.