Sonia Gandhi: సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ షాకింగ్ రియాక్షన్

రాష్ట్రపతి ప్రసంగంపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దేశంలో అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా సోనియా ప్రవర్తించారంటూ మండిపడింది.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని హితువుపలికింది.

New Update
Rastrapathi Bhavan, Draupadi Murmu and Sonia Gandhi

Rastrapathi Bhavan, Draupadi Murmu and Sonia Gandhi

Sonia Gandhi: బడ్జెట్‌ సమావేశాల్లో(Budget Sessions) భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం(Rastrapathi Bhavan) స్పందించింది. దేశంలో అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా సోనియా ప్రవర్తించారంటూ మండిపడింది. ఇలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపింది.   

Also Read: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?

రాష్ట్రపతి ప్రసంగం చేసేటప్పుడు అలసిపోయారని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆమె అలసిపోలేదు. అణగారిన వర్గాలు, రైతులు, మహిళల కోసం మాట్లాడేటప్పుడు ఆమెకు అలసట రాదు. రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన వారికి భారతీయ భాష, యాసలతో పరిచయం ఉండకపోవచ్చు. అందుకే వాళ్లకు రాష్ట్రపతి అలసిపోయిట్లు అనిపించి ఉండొచ్చు. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్నవారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని'' రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో రాసుకొచ్చింది.  

సోనియాగాంధీపై బీజీపీ(BJP) ఆగ్రహం..

ఇదిలాఉండగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో(Parliment Budget Sessions) భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ప్రసంగం అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారని వ్యాఖ్యానించారు. సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయాయి. దీంతో బీజీపీ(BJP) సోనియాగాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Read: అలా చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తా.. ట్రంప్ హెచ్చరిక

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలు ఇలా మాట్లాడకూడదని బీజపీ ఎంపీ సుకంతా మజుందార్ మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించే అలా మాట్లాడకూడదంటూ హితువు పలికారు. ఆదివాసి కుటుంబం నుంచి వచ్చి ద్రౌపతి ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ జమిందారీ మైండ్‌సెట్‌ ఈ విషయాన్ని అంగీకరించడంలేదంటూ విమర్శించారు. అందుకే ముర్ము ప్రసంగాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు