/rtv/media/media_files/2025/04/27/B8hfGKiM1LOyCwtSMTzX.jpg)
jeelam
పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. భారత్ వైపు నుంచి నీటి ప్రవాహం పెరిగిపోయిందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.పహల్గాం ఉగ్రదాడి పై చర్యల్లో భాగంగా భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Also Read: Mahesh Babu ED Notice : ఈడీ విచారణకు మహేశ్ బాబు డుమ్మా ? ఈడీ రియాక్షన్పై ఉత్కంఠ...
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో నటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హట్టియాన్బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అంతర్జాతీయ నీటి నిర్వహణ నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు.ఇది ముజఫరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Also Read:Pakistan-Bharat: భారత్ కోసమే 130 అణుబాంబులు..పాక్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు!
ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని మసీదుల నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోథి ప్రాంతంలో పీవోకేలోకి చేరుతుందనే విషయం తెలిసిందే.సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వడం లేదని తాము నమ్మేవరకు సింధూ జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్లు భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్ లోని రిజర్వాయర్లలో పేరుకున్న బురదను తొలగించేందుకు దిగువకు నీటి విడుదలను ఈ ఒప్పందం ఆపుతుంది. ఎందుకంటే..ఇప్పుడు నీరు దిగువకు విడుదల చేస్తే..మళ్లీ నీరు నింపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిందే.తాజాగా ఒప్పందం సస్పెన్షన్తో ఎప్పుడంటే అప్పుడు దిగువకు విడుదల చేసి..తాజా నీటిని నింపుకొనే అవకాశం లభిస్తుంది.
Also Read:Pahalgam Terror Attack : ఇంటి దొంగలే దేశ ద్రోహులు.. ఉగ్రవాదులకు 15 మంది కశ్మీరీలు సహాయం!
pok | floods | attack in Pahalgam | latest-news