మాకు ప్రత్యేక దేశం కావాలి.. పాక్ పై తిరగబడ్డ హిందువులు|Sindh Wants Separate Sindhudesh | Balochistan
మరో 36 గంటల్లో భారత్, పాక్ మధ్య యుద్ధం జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. యుద్ధం జరిగితే పాక్లోని ముఖ్యమైన ప్రాంతాలు భారత్ భూభాగంలోకి వస్తాయని అంటున్నారు. శని గ్రహంలో మార్పుల వల్ల భారత్కు యుద్ధంలో అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
భారత సైనిక దళాల కదలికలకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, ఫొటోలను పాకిస్థాన్కు చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్లో అరెస్ట్ చేశారు. అమృత్సర్కు చెందిన పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్లు పాకిస్థాన్కు అందజేస్తున్నారని దర్యాప్తులో తేలింది.
భారత్ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్న కొందరు పాకిస్థాన్ జర్నలిస్ట్ల ట్విట్టర్ ఖాతాలను కేంద్రం బ్యాన్ చేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఖాతాలను బ్యాన్ చేసింది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. తాజాగా దీని పై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్రరాజ్యం పేర్కొంది.
పూంఛ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అర్థరాత్రి సమయంలో కుప్వారా, పూంఛ్ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడటంతో భద్రతా బలగాలు తక్షణమే స్పందించాయి.