/rtv/media/media_files/2025/05/31/Cwf9fcxqk12mkqX8LkE4.jpg)
దాయాది దేశం పాకిస్తాన్తో ఇక మాట్లాడుకోడాలు లేవని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. పాకిస్థాన్కు ప్రధాని మోడీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. శనివారం (మే 31) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని పురస్కరించుకుని భోపాల్లో నిర్వహించిన మహిళా సశక్తీకరణ్ మహా సమ్మేళన్లో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్తో హిందూ వైవాహిక సాంప్రదాయానికి చిహ్నమైన సింధూరం నేడు నారీ శక్తి, జాతీయ శౌర్యానికి చిహ్నంగా మారిందన్నారు. భారత్ ఇప్పటివరకూ చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో సిందూర్ భారత్ అతిపెద్దదని అన్నారు. టెర్రిస్టులకు భూమిపై నూకలు చెల్లాయని ఆపరేషన్ సింధూర్ స్పష్టమైన సందేశాన్ని పంపిందన్నారు. ఇప పాకిస్తాన్, ఉగ్రవాదులు దాడులు చేస్తే దానికి బుల్లెట్లతోనే సమాధానం చెబుతామని ప్రధాని అన్నారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, దేశ ప్రజలను కాపాడుకోవడంలో అచంచలమైన నిబద్ధతను ఆపరేషన్ సిందూర్ ప్రదర్శించిందని పేర్కొన్నారు.
Also Read : పాక్ను తిడుతూ యువతి పోస్టు.. అరెస్టు చేసిన పోలీసులు
Modi Warns Pakistan
Eat Roti with peace or else get ready to eat our Bullets - PM Modi to Pakistan 🤣🤣🤣
— Mr Sinha (@MrSinha_) May 26, 2025
pic.twitter.com/WYISWJ8lsc
Also Read : జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
రాణి అహల్యాబాయి చెప్పినట్లుగా.. ఒక నాయకుడు ప్రజల జీవితాల్లో సంస్కరణలను తీసుకురావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అహల్యాబాయి ఎప్పుడూ పేదలకు సహాయం చేసి వారి జీవితంలో పురోగతి సాధించడానికి తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. అహల్యాబాయి హస్తకళల రంగంలో మహిళలకు సాధికారత కల్పించారని, నీటి సంరక్షణ కోసం కృషి చేశారని గుర్తుచేశారు. అహల్యాబాయి అభివృద్ధి పనులకు పునాది వేసిన కాశీలో సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఆమె జునగర్ నుంచి ఎన్నో గిరిజన కుటుంబాలను మహేశ్వర్కు తీసుకువచ్చారు. వారికి మహేశ్వరి చీరలను తయారు చేసే పనిని నేర్పించారని.. ఆ పని ఇప్పటికీ అనేక కుటుంబాలకు ఆదాయంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
Also Read : గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో
⚡️🇵🇰🇮🇳 BREAKING:
— The Arab Eye (@TheArabEye0) May 26, 2025
Indian PM Narendra Modi threatens Pakistani public by saying,
“Live a peaceful life, eat bread otherwise my bullet is ready”#IndiaPakistanWar #Pakistan #India pic.twitter.com/u2WlvLJSN9
Also Read : సౌత్ ఇండియా No.1 రిచెస్ట్ హీరో – నాగార్జున సంపద చూస్తే షాక్ అవుతారు!"
warning | Terror Attack | pakisthan | madyapradesh | latest-telugu-news | Pahalgam Terror Attack News | reply with guns