Afghanistan Water Strike On Pak | పాకిస్తాన్ పై తాలిబన్ల బాంబ్ | India Pak War | Talibans | RTV
ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలోని రోడ్లపై పాక్ జెండాలను అతికించి నిరసన చేపట్టారు. అయితే ఈ నిరసనలకు అనుమతి తీసుకోలేదనే కారణంతో పోలీసులు ఆరుగురు బజరంగ్ దళ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత యుద్ధ వాతావరణం ఇరు దేశాల మధ్య చోటుచేసుకుంది. పాక్తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. దీనికి ముఖ్య కారణం భద్రతా వైఫల్యమేనని ఆరోపించారు. కాశ్మీర్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపారు.
పహల్గాంలో ఉగ్రవాదులు దాడిచేసి 28మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి తామే కారణమని లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించుకుంది. అయితే ఆ సంస్థ తాజాగా మాట మార్చింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించింది.