Covid-19: కరోనా కలకలం.. 6 వేలు దాటిన కేసులు, 65 మంది మృతి
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటిదాకా కరోనాతో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటిదాకా కరోనాతో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహామ్మారి మరోమారు తన ప్రతాపాన్ని చూపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదువుతుండగా తాజాగా వరంగల్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం కలకలం సృష్టించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో ఆరు కరోనా కేసులను నిర్ధారించారు.
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ డిమాండ్ పెరిగింది. చికెన్ ధరలు ఒక్కసారిగా రూ. 30 వరకు పెరిగాయి. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రోటీన్ ఫుడ్ అయిన చికెన్, గుడ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
పిల్లలకి జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధితో పోరాడటానికి శరీరానికి తగినంత విశ్రాంతితోపాటు నీరు, కొబ్బరి నీళ్లు, సూప్, పోషకమైన ఆహారం పెట్టాలి. మాస్క్లు ధరించాలి, చేతులు కడుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో కరోనా రోజురోజుకీ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 478 కేసులు నమోదు కాగా.. 278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా NB.1.8.1, LF.7 అనే వేరియంట్ల కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కేసులు ఉన్నాయి.
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్కి కరోనా పాజిటివ్గా తేలింది. ఇప్పటికే ఏపీలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకటి, కడపలో మరోకరికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది.