/rtv/media/media_files/2025/06/07/tiwXyas6Ns54iNlhwHmp.jpg)
Female patient in ICU allegedly raped in Rajasthan’s Alwar
రాజస్థాన్లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఓ మహిళపై అక్కడి నర్సింగ్ స్టాఫ్పై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. బుధవారం జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వార్లోని ఈఎస్ఐసీ మెడికల్ కళాశాలలో ఓ మహిళ (32) ఐసీయూలో చికిత్స తీసుకుంటోంది. ఆమె కుటుంబ సభ్యులు వార్డు బయట ఎదురుచూస్తున్నారు.
Also Read: శివసేన (UBT)- మహారాష్ట్ర నవనిర్మాణ సేన పొత్తు !.. ఉద్దవ్ ఠాక్రే కీలక ప్రకటన
Female Patient In ICU
ఈ సమయంలోనే నర్సింగ్ సిబ్బంది ఒకరు ఐసీయూలోకి వచ్చారు. ఆ మహిళ ఉన్న బెడ్ చుట్టూ కర్టెన్లు వేసి మత్తుమందు ఇచ్చాడు. దీంతో ఆమె కొంచెం స్పృహలోనే ఉంది. తన కుటుంబీకులను పిలిచేందుకు యత్నించినా కూడా ఫలితం లేకపోయింది. చివరికి ఆమె స్పృహలోకి వచ్చాక అసలు విషయం బయటపడింది.
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
దీంతో బాధితురాలి భర్త ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. కానీ వాళ్లు దీన్ని ఖండించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ఆస్పత్రి అధికారి ఒకరు వెల్లడించారు.
Also Read: చిలికి చిలికి గాలి వాన..ట్రంప్, మస్క్ ల మధ్య ఎప్పటి నుంచో భేదాలు
Also Read: ఛత్తీస్గఢ్లో ఎన్ కౌంటర్, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి
telugu-news | rtv-news | rape | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu