/rtv/media/media_files/2025/06/02/9vExCZVtKyVCFEQe1woe.jpg)
maoist na Photograph: (maoist na)
Chhattisgarh Encounter : మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు సురక్షిత స్థావరాలుగా భావించిన కర్రెగుట్టలు, అబూజ్ మడ్ మావోయిస్టుల చేజారిపోయాయి. ఇప్పుడు నేషలన్ పార్కు ను కూడా భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి.కర్రెగుట్టల్లో పలువురు నాయకులను కోల్పోయిన పార్టీ అబూజ్ మడ్లో పార్టీ అగ్రనేత నంబాల కేశవరావును కోల్పోయింది. తాజాగా చత్తీస్ గఢ్లో వరుసగా కాల్పుల మోత మోగుతుంది. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ హతమయ్యారు. కాగా, సుధాకర్పై రూ.కోటి రివార్డు ఉండగా.. భాస్కర్పై రూ.25 లక్షల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: ఆ అడవుల్లో రూ.70 వేల కోట్ల విలువైన వజ్ర నిక్షేపాలు
బీజాపుర్ జిల్లాలోని నేషనల్ పార్క్లో జరుగుతున్న ఆపరేషన్లో మూడో రోజు మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర నేతలు మృతి చెందినట్లు తెలుస్తోంది. వారు ఎవరనేది భద్రదళాలు వెల్లడించలేదు. ఘటనాస్థలం నుంచి పెద్దఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. గత మూడు రోజులుగా నేషనల్ పార్క్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతాదళాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి.
Alsoo Read : ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం
నేషనల్ పార్క్ సుమారు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ పార్కును మావోయిస్టులు ఇన్నాళ్లు తమకు సురక్షిత ప్రాంతంగా భావించారు. నిజానికి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక్క పోలీస్ స్టేషన్ గానీ.. క్యాంప్ గానీ లేవు. దీంతో నేషనల్ పార్కును మావోయిస్టులు తమ అవాసంగా మార్చుకున్నారు. అడవిపై పూర్తిగా పట్టు సాధించారు. గతంలో ఇక్కడికి ఏ ఒక్క పోలీస్ బృందం వచ్చినా దాఖలాలు లేవు. కానీ ఇపుడు అంతా మారిపోయింది. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం భద్రతాదళాలను వినియోగిస్తుండడంతో నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు పాల్గొన్నాయి. అగ్రనేతలను మట్టుపెట్టడమే లక్ష్యంగా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ పార్కులో మావోయిస్టు నేత మడావి హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో భద్రతాదళాల అపరేషన్ కొనసాగుతోంది.
Also Read: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్లైన్లో రూ.3.85 కోట్లు స్వాహా