Air India Bomb Threat: మరో ఎయిర్ ఇండియా విమానంలో బాంబు..!

ఎయిర్ ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ముంబై నుండి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘‘ఎయిర్ ఇండియా 2948@ టి3లో బాంబు ఉంది’’ అని టిష్యూ పేపర్‌పై రాసిన మెసేజ్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది.

New Update
Air India Bomb Threat (1)

Air India Bomb Threat (1)

ఎయిర్ ఇండియా విమానం మరోసారి వార్తల్లో నిలిచింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా 2948 @ T3 ఫ్లైట్‌లో బాంబు ఉందన్న వార్త కలకలం రేపింది. శుక్రవారం (జూన్ 27) ఉదయం సిబ్బందికి టిష్యూ పేపర్‌పై ఒక మెసేజ్ కనిపించింది.  

Also Read :  జూలైలో స్మార్ట్‌ఫోన్ల జాతరే జాతర.. నథింగ్, శాంసంగ్, వన్‌ప్లస్ నుంచి కిర్రాక్ మొబైల్స్!

Bomb Threat on Air India

‘‘ఎయిర్ ఇండియా 2948@ టి3లో బాంబు ఉంది’’ అని టిష్యూ పేపర్‌పై రాసిన మెసేజ్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది.  దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. వెంటనే ఎయిర్ ఇండియా 2948 విమానంలో బాంబు స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే విమానంలో ఎలాంటి బాంబు కనపడకపోయే సరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెసేజ్‌ను ఫేక్ అని అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు ఇదేమి మొదటిసారి కాదు. ఇటీవల జూన్ 13న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపు కారణంగా థాయిలాండ్ నుండి ఢిల్లీకి వస్తున్న AI-379 విమానం థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్పటికి విమానంలో 156 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

Also Read :  మరి కాసేపట్లో స్క్విడ్ గేమ్ ఆఖరి పోరు! ఇండియాలో స్ట్రీమింగ్ టైమ్ ఇదే

Also Read :  వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇలా చేసి భారీగా డబ్బులొస్తాయ్!!

Also Read :  సింగిల్ ఛార్జింగ్.. 500 కి.మీ మైలేజ్‌తో 2 కొత్త కార్లు.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

Bomb threat latest | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu | viral news telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు