/rtv/media/media_files/2025/06/26/data-extraction-from-black-box-2025-06-26-17-47-56.jpg)
Data extraction from black box
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టింగ్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేస్తోంది. అయితే విమానంలో ఉండే బ్లాక్బాక్స్కు సంభందించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఉండే డేటాను ఏఏఐబీ ల్యాబ్ డౌన్లోడ్ చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read: యాక్సియమ్-4 మిషన్ సక్సెస్.. ISSతో డాకింగ్ అయిన స్పేస్క్రాఫ్ట్
Black Box Data Recovery
'' ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగాక దీనిపై దర్యాప్తు కోసం జూన్ 13న ఏఏఐబీ టీమ్ను ఏర్పాటు చేసింది. అదేరోజున రూఫ్టాప్పై కాక్పిట్ వాయిస్ రికార్డర్లు, ఫ్లైట్ డేటా రికార్డర్లను గుర్తించాం. ఆ తర్వాత విమానంలోని బ్లాక్బాక్సును స్వాధీనం చేసుకున్నాం. జూన్ 24 నుంచి వీటిలో డేటాను బయటకు తీసే ప్రక్రియను టీమ్ ప్రారంభించింది.
Also Read: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !
విమానం ముందువైపు ఉండే బ్లాక్బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ (CPM) సురక్షితంగా బయటకు తీశాం. జూన్ 25న మెమొరీ మాడ్యుల్ యాక్సెస్ చేశాం. అలాగే అందులో ఉన్న డేటాను ఏఏఐబీ ల్యాబ్లో డౌన్లోడ్ చేశాం. కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లో డేటాను పరిశీలిస్తున్నాం. దీనివల్ల విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు, ఆ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకనే ఛాన్స్ వచ్చిందని'' విమానయాన శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది.
Also Read: తనను ప్రేమించలేదన్న కోపం..యువతి చేసిన పనితో కటకటాల్లోకి..
Also Read : పెళ్లి మండపంలో మందు, సిగరేట్ తాగిన వధువు: వీడియో వైరల్
air india flight crash in gujarat | flight-accident | Black Box | national-news | rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu