/rtv/media/media_files/2025/06/26/cyber-crime-2025-06-26-16-09-43.jpg)
Cyber Crime
ఆమె అతన్ని ప్రేమించింది. కానీ, అతడు ఆమె ప్రేమను అంగీకరించలేదు. అంతేకాదు ఆమెను కాదని మరో పెళ్లి చేసుకున్నాడు. అంతే ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. దానికోసం దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులకు పాల్పడింది. అయితే బెదిరింపులకు కారణమైన ఈ మెయిల్ ను ట్రాక్ చేసి నిందితురాలిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమెపై సైబర్ క్రైమ్ నేరం పెట్టి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన రెనె జోష్లిడా అనే మహిళ తనతో పనిచేసే దివిస్ ప్రభాకర్ను ప్రేమించింది. అయితే ఆమె మీద ప్రేమలేని ప్రభాకర్ ప్రేమను అంగీకరించలేదు. అంతేకాక మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈగో దెబ్బతిన్న రెనె జోష్లిడా అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తాను చదువుకున్న రోబోటిక్ ఇంజినీరింగ్ సాంకేతికతను ఉపయోగించి నకిలీ ఇ-మెయిల్ ఐడీ సృష్టించింది.
Also Read : జ్ఞాపకశక్తి పదునుగా మారే ఇంటి చిట్కాలు.. ఇవి చాలా ఉపయోగకరం తెలుసా..!!
Anger In Jail
అంతేకాక ఈ నెల ఒకటి నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు 21సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ చేసింది. అది కూడా మతపరమైన, ముఖ్యనేతల కార్యక్రమాల సమయంలో మెయిల్స్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడింది. నరేంద్రమోదీ ప్రసంగించే మైదానంలో బాంబు ఉన్నట్లు, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి తానే కారణమని బాధ్యత వహించేలా ఇలా అనే రకాలుగా ఆమె బెదిరింపులకు పాల్పడింది. వీపీఎన్ సాంకేతికతను ఉపయోగించిన రెనెజోష్లిడా ట్రాక్వెబ్ ద్వారా తనను గుర్తించని విధంగా బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Also Read : స్కూల్లో తొక్కిసలాట.. 29మంది పిల్లలు మృతి, 250 మందికి పైగా!
ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులకు పాల్పడిన మహిళా ఇంజినీర్ను గుజరాత్ పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. కొద్దిరోజుల కిందట అహ్మదాబాద్లోని దివ్యజ్యోత్ పాఠశాలకు ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు దర్యాప్తు చేయగా బాంబు లేదని తెలిసింది. ఇంతకుముందు అక్కడి జెనీవా లిబ్రాల్ అనే పాఠశాలకు పంపిన బాంబు బెదిరింపులు కేసు ఇది ఒకేలా ఉండడంతో గుజరాత్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెన్నై సాలిగ్రామానికి చెందిన రెనె జోష్లీడా ఇ-మెయిల్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది.
Also Read : ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్
అయితే ఈ మెయిల్స్ పై దృష్టి సారించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కొద్దిరోజుల కిందట అహ్మదాబాద్లోని దివ్యజ్యోత్ పాఠశాలకు ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు దర్యాప్తు చేయగా బాంబు లేదని తేలింది. దీంతో అసలు ఈ బెదిరింపులు ఎవరు చేస్తున్నారని ఎంక్వరీ మొదలు పెట్టారు. ఇంతకుముందు అక్కడి జెనీవా లిబ్రాల్ అనే పాఠశాలకు పంపిన బాంబు బెదిరింపులు కేసు ఇది రెండు ఒకేలా ఉండడంతో గుజరాత్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెన్నై సాలిగ్రామానికి చెందిన రెనె జోష్లీడా ఇ-మెయిల్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు గుర్తించారు. గుజరాత్ నుంచి చెన్నై చేరుకున్న పోలీసులు కేకేనగర్ పోలీసుల సాయంతో రెనె జోష్లిడా, ఆమె తండ్రి ఆల్ట్వీన్ జోసెఫ్లను దర్యాప్తు నిమిత్తం విమానంలో గుజరాత్ తీసుకెళ్లారు.
Also Read : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కష్టమేనా.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదేనా?
love-failure | Cyber crime call | Cyber Crime | tamilandu | tamilanadu