/rtv/media/media_files/2025/06/26/axiom-4-docks-with-iss-2025-06-26-16-32-12.jpg)
Axiom-4 Docks With ISS
యాక్సియన్-4 స్పేస్ మిషన్ కింద శుభాంశు శుక్లా బృందం స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ ఎయిర్క్రాఫ్ట్లో నింగిలోకి పయనమైన సంగతి తెలిసిందే. అయితే మిషన్లో భాగంగా తాజాగా డ్రాగన్ స్పెస్క్రాఫ్ట్ ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ (ISS)తో డాకింగ్ అయ్యింది. కాసేపట్లో శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్లో అడుగుపెట్టనున్నారు. దాదాపు 28 గంటల ప్రయాణం తర్వాత డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ ఐఎస్ఎస్కు చేరుకుంది. ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగుపెట్టిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుంభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.
Also Read : స్కూల్లో తొక్కిసలాట.. 29మంది పిల్లలు మృతి, 250 మందికి పైగా!
Also Read : జ్ఞాపకశక్తి పదునుగా మారే ఇంటి చిట్కాలు.. ఇవి చాలా ఉపయోగకరం తెలుసా..!!
Axiom-4 Docks With ISS
#Axiom4Mission की डॉकिंग सफलतापूर्वक अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन पर हुई। इस मिशन का संचालन भारत के ग्रुप कैप्टन शुभांशु शुक्ला ने किया।
— ANI_HindiNews (@AHindinews) June 26, 2025
(वीडियो: NASA via Reuters/ANI News YouTube) pic.twitter.com/syjMzS0oD5
Also Read : ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్
ఇదిలాఉండగా యాక్సియం 4 మిషన్ కింద శుభాంశు బ--ృందం.. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో బుధవారం మధ్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని రోదసిలోకి తీసుకెళ్లింది. ముందుగా డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను ISS కన్నా తక్కువ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వివిధ సర్దుబాట్లు, ప్రక్రియలు దాటి అది క్రమంగా ఐఎస్ఎస్ను చేరుకుంది. వ్యోమగాములు ISSలో సుమారు రెండు వారాల పాటు ఉండి పరిశోధనలు చేయనున్నారు.
Also Read : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కష్టమేనా.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదేనా?
Axiom 4 mission | international-space-station | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu