/rtv/media/media_files/2025/06/19/dna-in-ahmedabad-plane-crash-2025-06-19-11-55-41.jpg)
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి నేటికి వారం రోజులు. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారం రోజులు కావస్తున్నా ఇంకా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. DNA టెస్ట్ చేసి ఇప్పటి వరకూ 210 మంది బాధితుల వివరాలను గుర్తించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు.
Also Read : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పుతిన్కు కౌంటర్ ఇచ్చిన ట్రంప్
Ahmedabad Plane Crash
Air India plane crash | Gujarat Minister Rushikesh Patel says, "Till 0830 hours today, DNA of 210 people have matched and 187 mortal remains handed over to respective families." pic.twitter.com/X6f7Ps4iG9
— ANI (@ANI) June 19, 2025
Also Read : అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్న్యూస్.. మళ్లీ వీసాలు షురూ
డీఎన్యే పరీక్షలు చేసి 210 మృతదేహాలను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. వాటిలో 187 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మిగతా డెడ్బాడీస్ అప్పగింత ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. DNA టెస్టులు చేయడానికి అహ్మదాబాద్లో ప్రయోగశాల 24 గంటలూ పని చేస్తోంది. డెడ్బాడీలు గుర్తించలేనంతగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి వాటితో డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు చెబుతున్నారు.
Also Read : ఈ ఫార్ములా కేసులో ACBకి కేటీఆర్ లేఖ
Also Read : మర్మాంగాలు కోసి.. కారుతో ఈడ్చుకెళ్లి.. వణుకుపుట్టిస్తున్న ఒంగోలు హత్య!
latest-telugu-news | deadbody | air india accident | Ahmedabad-London flight crash | ahmedabad plane crash news | ahmedabad airport plane crash | Ahmedabad Tragedy | ahmedabad airport incident | today-news-in-telugu | national news in Telugu