🔴Live News Updates: సచివాలయంలో కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా.. ఊహించని పరిణామంతో భట్టి జంప్!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

Pakistan: టెర్రరిజంలో పాకిస్తాన్ 2వ స్థానంలో...భారత్ 14వ స్థానంలో...

టెర్రరిజంలో పాకిస్తాన్ తమ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది పాకిస్తాన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 లో రెండవ స్థానంలో నిలిచింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.

index
Pakistan In Second Place in Global Terrorism Index

 Also Read: Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్...గ్లోబల్ టెర్రరిజంపై తాజాగా నివేదిక ప్రచురించింది. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా 163 దేశాలపై టెర్రరిజం ప్రభావాన్ని వివరించింది. ఉగ్రవాద ఘటనల సంఖ్య, ప్రాణనష్టం, గాయాలు, బందీలు, ఉగ్రవాదంపై ప్రభావం వంటి సూచికల ద్వారా ఈ సర్వేని చేసింది ఐఈపీ. ఈ సర్వే లో అన్నింటి కంటే ఆఫ్రికాలోని బుర్కినాఫాసోలో టెర్రరిజం అందరి కంటే ఎక్కువగా ఉందని చెప్పింది. దీని తరువాత స్థానంలో పాకిస్తాన్ ఉండగా..మూడవ ప్లేస్ లో సిరియా ఉంది. 

Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి..

పాకిస్తాన్ లో ఈ మధ్య ఉగ్రవాద దాడులు బాగా పెరిగాయి. దాంతో పాటూ అక్కడ చనిపోతున్నవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. 2024లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు 45 శాతం భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది. ఇక్కడ 52 శాతం మరణాలకు పాక్ తాలిబాన్లే కారణమని చెప్పింది. ముఖ్యంగా పాక్ లో ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనే 96 శాతం ఉగ్రదాడులు, మరణాలు జరిగినట్లు సర్వే తేల్చింది.

ఇక గ్లోబల్ టెర్రరిజ ఇండెక్స్ లో భారత్ 14 వస్థానంలో ఉంది. ఉగ్రవాదం అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో డెన్మార్క్ దేశం ఉంది. ఇక ఇండియా పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 35వ స్థానంలో ఉండగా ...అగ్రరాజ్యం అమెరికా 34వ స్థానంలో ఉంది. మయన్మార్ 11వ స్థానంలో ఉంది. అనూహ్యంగా ఇరాక్, ఇరాన్, పాలస్తీనా వంటి దేశాలు టాప్-10 జాబితాలో లేవు. టెర్రరిజం ఇండెక్స్ లో టాప్ 10 దేశాలుగా బుర్కినాఫాసో, పాకిస్తాన్, సిరియా, మాలి, నైజర్, నైజీరియా, సోమాలియా, ఇజ్రాయిల్, ఆఫ్ఘనిస్తాన్, కామెరూన్ ఉన్నాయి. 

  • Mar 07, 2025 18:11 IST

    హైదరాబాద్‌లోని ఆ ఫేమస్ హోటళ్లలో బొద్దింకలు, ఎలుకలు.. మీరే చూడండి!

    హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ తాజా కిచెన్, టోలిచౌకిలోని అమోఘ్ హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిల్వ ఉంచిన పదార్థాల దగ్గర బొద్దింకలు, ఎలుకలు, పాడైన కూరగాయలను అధికారులు గుర్తించారు. ఇలాంటి ఫుడ్స్ తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారు.

    Taja Kitchen
    Taja Kitchen Photograph: (Taja Kitchen)

     



  • Mar 07, 2025 18:10 IST

    రేవంత్‌, కేసీఆర్‌కు స్టాలిన్‌ సంచలన లేఖ.. ఎందుకో తెలుసా ?

    సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ విధానానికి వ్యతిరేకంగా ''జాయింట్ యాక్షన్ కమిటీ'' ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. మార్చి 22న చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరుకావాలని కోరారు.

    CM Revath, KCR and CM Stalin
    CM Revath, KCR and CM Stalin

     



  • Mar 07, 2025 18:03 IST

    సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఇక వారికి విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు..!

    తెలంగాణ బీసీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీ మేరకు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఎస్సీ వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఇచ్చిన నివేదికను మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

     BC reservation in jobs
    BC reservation in jobs

     



  • Mar 07, 2025 18:02 IST

    ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!

    తమిళనాడులోని తిరుత్తని సమీపంలో బస్సు, లారీ రెండు ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    V BREAKING



  • Mar 07, 2025 18:01 IST

    సచివాలయంలో కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా.. ఊహించని పరిణామంతో భట్టి జంప్!

    పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేయడం సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టిని కలిసేందుకు వచ్చిన దాదాపు 200 మంది కాంట్రాక్టర్లను సిబ్బంది అనుమతించలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు.

    Deputy CM Bhatti Vikramarka
    Deputy CM Bhatti Vikramarka

     



  • Mar 07, 2025 17:03 IST

    పోసానికి బెయిల్

    కడప కోర్టులో పోసాని కృష్టమురళికి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.

    Posani Krishna Murali
    Posani Krishna Murali

     



  • Mar 07, 2025 16:10 IST

    ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్!

    ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

    Read More: https://rtvlive.com/andhra-pradesh/ap-acharya-nagarjuna-university-bed-question-paper-leaked-telugu-news-8830913



  • Mar 07, 2025 16:07 IST

    తమిళ భాషకు గుర్తింపు ఇస్తాం.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

    తమిళనాడులో హిందీ భాషా వివాదం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. భాషా విషయంలో స్టాలిన్ రాజకీయం చేయడం సరైంది కాదన్నారు.

    Amit Shah
    Amit Shah

     



  • Mar 07, 2025 15:51 IST

    ఎర్రవల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం.... కేసీఆర్ సంచలన నిర్ణయం

    బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ర‌జ‌తోత్సవ వేడుక‌ల‌పై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షత‌న స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఏప్రిల్ 27న జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌పై నేత‌ల‌తో కేసీఆర్ సుధీర్ఘంగా చ‌ర్చించారు. ఈ మేరకు ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లో బీఅర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు.

    kcr-meet-brs-leaders
    kcr-meet-brs-leaders

     



  • Mar 07, 2025 15:50 IST

    దగ్గరుండి.. బెదిరించి.. కూతురుకు ఉరేయించి చంపిన తండ్రి.. పరువు హత్య కేసులో సంచలన విషయాలు!

    ఏపీ అనంతపురం తిలక్‌నగర్‌కు చెందిన భారతి పరువు హత్యకేసును పోలీసులు ఛేదించారు. తండ్రి రామాంజనేయులే ఆమెను ఉరేసుకుని చనిపోవాలని బెదిరించినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన తండ్రి, అతని పెద్ద అల్లుడు మారుతిని కూడా అరెస్ట్ చేశారు.  

    hanging hyderabad
    hanging hyderabad

     



  • Mar 07, 2025 15:49 IST

    ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్.. మంత్రి పదవిపై బిగ్ ట్విస్ట్?

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోషర్ తదితరులు పాల్గొన్నారు.

    Nagababu MLC Nomination
    Nagababu MLC Nomination

     



  • Mar 07, 2025 13:46 IST

    IPL Tickets 2025: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ధరెంతంటే..?

    ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ప్రైజ్ రూ. 400 నుండి రూ. 50,000+ వరకు నిర్ణయించారు. ఈ టిక్కెట్ బుకింగ్‌లను BookMyShow, Paytm Insider ద్వారా లేదా స్టేడియం వద్ద కొనుగోలు చేయవచ్చు. IPL 2025 సీజన్ మార్చి 22 నుండి మే 26, 2025 వరకు జరగనుంది.

    IPL Tickets 2025
    IPL Tickets 2025

     



  • Mar 07, 2025 07:03 IST

    TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం

    బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే  ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు  42 శాతం  రిజర్వేషన్లను కల్పించేలా బిల్లును రూపొందించారు.  

    Telangana Cabinet
    Telangana Cabinet

     



  • Mar 07, 2025 06:58 IST

    Flight: విమానంలో టాయిలెట్‌లలో సమస్య.. చివరికి

    ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అందులో టాయిలెట్లు మూసుకుపోయాయి. 10 గంటల పాటు ప్రయాణించిన ఆ విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. షికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఈ సంఘటన జరిగింది.

    Air India flight returns to Chicago due to technical issue
    Air India flight returns to Chicago due to technical issue

     



  • Mar 07, 2025 06:57 IST

    AP: ఆ షేర్ల బదిలీని రద్దు చేయండి..ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్

    తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది ఎన్సీఎల్టీ.

    jagan



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు