Donald Trump: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారత్‌పై 100 శాతం సుంకాలు

ట్రంప్‌ రష్యాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు. భారత్‌, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలను కోరినట్లు తెలస్తోంది.

New Update
Trump

Trump

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine War) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల భారత్‌పై 50 శాతం సుంకాలు విధించింన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ట్రంప్‌ రష్యాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు. భారత్‌, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలను కోరినట్లు తెలస్తోంది.  

Also Read: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ..ఇండియా, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని కామెంట్

Trump Urges EU

వాషింగ్టన్‌లో సీనియర్ అమెరికన్, యూరోపియన్ యూనియన్ అధికారులు రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ఈయూ అధికారులతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడారు. రష్యా మరింత ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చేందుకు భారత్, చైనాపై 100 శాతం సుంకం(trump tariffs) విధించాలని వాళ్లకి సూచించినట్లు సమాచారం. ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామని చెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కోరారు.

Also Read: భారత్ తో సుంకాలపై చర్చలు.. మోదీతో కూడా మాట్లాడతా అంటున్న ట్రంప్..

ఇలా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఓ యూఎస్‌ అధికారి కూడా చెప్పారు. కానీ యూరోపియన్ యూనియన్‌(European Union) కూడా ముందుకు వస్తే దీన్ని కలిసి అమలుచేస్తామని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధికారులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.  - international news in telugu

Also Read: నేపాల్‌లో పడిపోయిన ప్రభుత్వం.. రంగంలోకి ఆర్మీ

Advertisment
తాజా కథనాలు