Israel-iran War : యుద్ధంలోకి అగ్రరాజ్యం... జీ 7 సమ్మీట్ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు ట్రంప్‌..

ఇరాన్‌ ఇజ్రాయెల్‌ యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండు దేశాలు తగ్గేదేలా అన్నట్లు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా యుద్ధంలో చేరే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

New Update
Israel-iran War

Israel-iran War

Israel-iran War : ఇరాన్‌ ఇజ్రాయెల్‌ యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండు దేశాలు తగ్గేదేలా అన్నట్లు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా యుద్ధంలో చేరే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కెనడా పర్యటనను కుదించుకోవడం దీనికి బలం చేకూర్చుతుంది. జీ7 ట్రిప్‌ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు బయలు దేరారు ట్రంప్‌ . అమెరికాకు వెళ్లగానే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!

ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ దృవీకరించారు. ‘జీ7 సదస్సు (G7 Summit)లో ట్రంప్‌ చర్చలు జరిపారు. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని అమెరికాకు బయల్దేరనున్నారు’’ అని లీవిట్ పేర్కొన్నారు.  కాగా జీ7 దేశాల సదస్సులో పాల్గోన్న ట్రంప్‌ గ్రూప్‌ ఫొటో దిగారు. అనంతరం ‘నేను అత్యవసరంగా తిరిగి వెళ్లాలి. ఇది చాలా ముఖ్యం’ అని అమెరికా అధ్యక్షుడు ఇతర నేతలతో స్పష్టం చేశారు. ఈ  విషయమై జీ7 దేశాల నేతలు మాట్లాడుతూ .. ట్రంప్‌ వెనుదిరగడం సరైన నిర్ణయమే అని అన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారని, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధాన్ని ముగించాలని జీ7 నేతలు పిలుపునిచ్చారు.

Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
 
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను కుదించుకున్నట్లు తెలుస్తోంది.  ఇక అమెరికాకు వచ్చే ముందే  వైట్‌హౌస్‌ సిచ్యుయేషన్ రూమ్‌లో సిద్ధంగా ఉండాలని భద్రతా మండలి అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో  ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రికత్తలకు సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన లేసే అవకాశం ఉంది. ఇంకోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా సైతం ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశముందని తెలుస్తోంది. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగితే పరిణామాలు మరింత ఉద్ర్తిక్తతకు దారితీసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా!

Advertisment
Advertisment
తాజా కథనాలు