/rtv/media/media_files/2025/06/16/COmVH1PrlsJhKQb9TLaP.jpg)
railway reservation tickets
IRCTC: జూలై 1 నుంచి తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భారతీయ రైల్వే కీలక మార్పులు తీసుకొస్తోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై తత్కాల్ టికెట్లను ఆన్లైన్లో బుక్ చేయాలంటే వినియోగదారుడి ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరిగా మారనుంది. ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులందరూ తమ ఖాతాలను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త మార్గదర్శకాలను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ నిర్ణయం ప్రధానంగా ఏఐ బోట్లు, అక్రమంగా పనిచేస్తున్న ఏజెంట్ల వల్ల తత్కాల్ టికెట్లు సాధారణ ప్రయాణికులకు అందకుండా పోయే సమస్యను నివారించేందుకు తీసుకున్న చర్యగా చెబుతున్నారు.
ఫాస్ట్ట్రాక్ బుకింగ్ విధానం..
తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థ అనేది ఫాస్ట్ట్రాక్ బుకింగ్ విధానంగా ఉంది. ప్రయాణానికి ఒక రోజు ముందు అత్యల్ప సమయంలో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. అయితే ఇటీవల కాలంలో టికెట్లు విడుదలైన కొన్ని నిమిషాల్లోనే బుక్ అయిపోతుండటం, సాధారణ ప్రయాణికులకు అవకాశమే లేకుండా పోవడం వల్ల విమర్శలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆధార్ ఆధారిత ధృవీకరణను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: గొంతు కోసి.. కాలువలో పడేసి.. మోడల్ దారుణ హత్య!
తమ ఖాతాను ఆధార్తో లింక్ చేయాలనుకునే వారు మొదటగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లోకి ( www.irctc.co.in) లాగిన్ కావాలి. మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్లి అథెంటికేట్ యూజర్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీని ఎంటర్ చేసి వెరిఫై డీటెయిల్స్ అండ్ రిసీవ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ను నమోదు చేసి సమ్మతిని ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆధార్ విజయవంతంగా లింక్ అయినట్లు ధృవీకరణ మెసేజ్ వస్తుంది. ఈ మార్పులు ప్రయాణికుల భద్రతను పెంపొందించడమే కాకుండా.. టికెట్ల బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా ఉన్నాయని రైల్వే శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: మహిళా ప్యాసింజర్ను కొట్టిన ర్యాపిడో డ్రైవర్.. ఇంత దారుణమా..?
( tickets | railway | reservation | Latest News | telugu-news aadhaar )