/rtv/media/media_files/2025/06/16/ceXzGI6XcRyNhYP8BRpm.jpg)
PM Modi
ప్రధాని మోదీ ప్రస్తుతం సైప్రస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ ద్వీపదేశం మోదీకి అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని తెలిపారు. ఈ అవార్డును ఇరుదేశాల మధ్య స్నేహానికి అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు.
Also Read: భారీ మంటల్లోంచి వస్తున్న రమేశ్ విశ్వాస్ కుమార్.. బయటపడ్డ మరో సంచలన వీడియో
ప్రస్తుతం పశ్చిమాసియా, యూరప్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. '' పశ్చిమాసియా, యూరప్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇది యుద్ధాలు చేసుకొనే యుగం కాదని మేము విశ్వసిస్తున్నామని'' పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం
#WATCH | In Cyprus, PM Modi says, "We expressed worry over the ongoing conflicts in West Asia and Europe. We believe this is not an era of war." pic.twitter.com/7JbYbQ39wY
— ANI (@ANI) June 16, 2025
Also Read: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం.. నెక్స్ట్ పాకిస్థాన్పై దాడులు !
అలాగే భారత్-సైప్రస్ మధ్య ఉన్న భాగస్వామ్యం భవిష్యత్తులో కొత్త శిఖరాలను చేరుకుంటుందని మోదీ అన్నారు. ఇరుదేశాలు తమ దేశాల పురోగతిని బలోపేతం చేస్తాయని అలాగే సురక్షితమైన, శాంతియుత వాతావరణాన్ని నిర్మిస్తాయని ఆశాభావ వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా సైప్రస్ నుంచి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16-17న కననాస్కిస్లో జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం ఇది ఆరోసారి. జీ7 దేశాధినేతలతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఆ దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో సాంకేతికత, ఆవిష్కరణ, ఇంధన భద్రత ఇతర అంశాలపై చర్చలు జరపనున్నారు.
Also read: మమ్మల్ని తీసుకెళ్లండి ప్లీజ్.. ఇరాన్లో భయాందోళనలో భారతీయ విద్యార్థులు