/rtv/media/media_files/2025/06/09/JHrnxnsr16S9ioMBGJOf.jpg)
Malaysia bus crash kills at least 15, mostly university students
మలేసియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర మలేషియాలోని యూనివర్సిటీ విద్యార్థులను క్యాంపస్కు తీసుకెళ్తున్న బస్సు ఓ మినీవ్యాన్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో15 మంది విద్యార్థులు మరణించడం కలకలం రేపింది. మరికొంతమంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర మలేసియాలోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి చెందిన ఓ బస్సు విద్యార్థులను తీసుకొని వెళ్తోంది.
Also Read: ప్రయాణికులకు షాకిచ్చిన తెలంగాణ ఆర్టీసీ.. ఛార్జీలు పెంపు.. ఎంతంటే?
Malaysia Bus Crash
ప్రయాణంలో అదుపుపత్తి రోడ్డుపై వెళ్తున్న ఓ మినీ వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడగా 13 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయాలపాలైన 30 మంది విద్యార్థులను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్
ప్రస్తుతం ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన విద్యార్థుల్లో అందరూ 21 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్నవారేనని అధికారులు వెల్లడించారు. మరోవైపు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం.. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం చేయాలని ఉన్నత విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: భగ్గుమంటున్న లాస్ ఏంజిల్స్.. కాలిబూడిదవుతున్న వందల కార్లు
Also Read: భారీ భూకంపం.. ధ్వంసమైన బిల్డింగ్లు, బద్ధలైన రోడ్లు - వణికించే వీడియోలు
road-accident | rtv-news | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news