/rtv/media/media_files/2025/06/09/qhjdmAENT0fRJhL0DEpL.jpg)
TGSRTC Ticket Rates Hike
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఆర్టీసీ) బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది. పెరిగిన చార్జీలు అన్ని వర్గాల ప్రయాణికులపై ప్రభావం చూపించనున్నాయి. ముఖ్యంగా రోజూ బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులపై ఈ ధరల పెంపు తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
Also Read : నితిన్ 'తమ్ముడు' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్.. అనౌన్స్మెంట్ వీడియోలో హీరోయిన్ల అల్లరి!
బస్ పాస్ ధరలు..
ఇప్పటివరకు నెలకు రూ.1,150గా ఉన్న ఆర్డినరీ పాస్ ధరను రూ.1,400కు పెంచారు. ఇది సుమారుగా 22 శాతం పెరుగుదల కావడం గమనార్హం. అదే విధంగా.. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను రూ.1,300 నుంచి రూ.1,600కు, మెట్రో డీలక్స్ పాస్ను రూ.1,450 నుంచి రూ.1,800కు పెంచారు. అంతేకాకుండా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉపయోగించే గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా పెరిగాయి. రోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు నెలలో సాధారణంగా బస్ పాస్పై ఆధారపడుతుంటారు. వారికి నెలవారీ ఖర్చు రూ.250-400 వరకు పెరగడం వల్ల వారి బడ్జెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఈ చిన్న చిట్కాలతో కడుపు ఉబ్బరం దెబ్బకు మాయం.. జెస్ట్ జీవనశైలి ఇలా చేంజ్
విద్యార్థులకూ ఇది పెద్ద షాక్. విద్యా సంస్థలకు వెళ్లే చాలా మంది విద్యార్థులు తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు బస్ పాస్పై ఆధారపడతారు. పాస్ ధరలు పెరగడంతో వారిపై కూడా అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం బస్ పాస్ చార్జీలు పెంచటంతో మధ్యతరగతి, పేద వర్గాలవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తల్లికంటే ఎక్కువ మేలు చేసే రసం.. డైలీ తీసుకుంటే 5 సమస్యలు పరార్
Also Read : West Bengal: అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి
latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news | tgsrtc-bus