/rtv/media/media_files/xuwpsSA6ABVfhNQGCEGT.jpg)
ఫ్యూచర్ సీటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బయటకు కనిపించడానికి వీలులేదని స్పష్టం చేశారు. హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ శాఖపై ఈరోజు సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలన్నారు. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గతేడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు. 2025-26 లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందని తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
Also Read : నవంబర్లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
Revanth Reddy Key Orders To Electricity Officials
రానున్న మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని సీఎం అధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలన్నారు. రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.
Also Read : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ!
భవిష్యత్ లో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మారబోతోందన్నారు. హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
Also Read : ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. మైనర్ను ప్రేమించి..చెల్లెలు కావాలని...
Also Read : యువకుడి ప్రాణం తీసిన ట్రాన్స్ఫార్మర్.. లైవ్ లోనే ఘోరం ( వీడియో వైరల్)
telugu breaking news | telugu-news | hyderabad | electric-power