/rtv/media/media_files/2025/06/27/husband-killed-his-wife-in-bangalore-2025-06-27-07-53-30.jpg)
Husband killed his wife in Bangalore
రోజు రోజుకూ భార్య, భర్తల మధ్య సంబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు గొడవ పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణకావేశంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కన్నవారిని, కన్న బిడ్డలను ఒంటరిని చేస్తున్నారు. అక్రమ సంబంధాలతో కొందరు హత్యకు గురికాగా.. మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకొందరు చిన్న చిన్న మనస్పర్థాల కారణంగా బలైపోతున్నారు.
Also Read: సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం.. 700 బ్యాంకుల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు
కొబ్బరి తురిమే పీటతో
తాజాగా అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చోటుచేసుకుంది. భార్య వంట సరిగా చేయలేదనే కోపంతో భర్త నరికి నరికి చంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మాగడి సమీపంలోని మత్తికెరెలో రంగయ్య (68), తిమ్మమ్మ (65) దంపతులు ఎన్నో ఏళ్లుగా కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తరచూ వీరి మధ్య చిన్న చిన్న మనస్పర్థాలు జరుగుతుండేవి. ఒక్కోసారి గొడవలు కూడా పడేవారు.
Also Read: టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు.. తుపాకీతో కాల్పులు
అయితే బుధవారం రాత్రి వంట చేసే విషయంలో భార్య తిమ్మమ్మతో భర్త రంగయ్య గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారడంతో ఆమెపై దాడి చేశాడు. కొబ్బరి తురిమే పీటతో నరికి హత్య చేశాడు. అనంతరం ఆ రాత్రి ఇంట్లోనే ఉండి.. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని రామనగరలో మాగడి పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: HYDలో ఒకే బైక్పై 8 మంది యువకుల స్టంట్.. పోలీసులకు దొరకడంతో.. (వీడియో)
Alspo Read : ఆఖరి పోరు నేడే! ఇండియాలో స్ట్రీమింగ్ టైమ్ ఇదే
bengaluru | Latest crime news | crime news | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | national news in Telugu | Husband Kill Wife | wife and husband fight