/rtv/media/media_files/2025/06/24/bike-stunts-video-2025-06-24-12-03-36.jpg)
Bike Stunts video
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ఎక్కువైపోయింది. వైరల్గా మారాలనే ఉద్దేశంతో యువత పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు రకరకాల విన్యాసాలు చేస్తూ కటకటాలపాలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఒకే బైక్పై ఎనిమిది మంది యువకులు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ పోలీసుల చేతికి చిక్కారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
Bike Stunts video
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్పహాడ్ వద్ద 8 మంది యువకులు ఒకే బైక్పై అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త వైరల్గా మారడంతో పోలీసుల వరకు వెళ్లింది.
Also Read: ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
ఒకే బైక్పై ఎనిమిది మంది యువకులు ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ పోలీసుల చేతిలో చిక్కారు.
— TeluguPost (@telugu_post9) June 24, 2025
ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్పహాడ్ వద్ద చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి… pic.twitter.com/J8xEIOVHek
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
దీంతో ఈ స్టంట్స్పై పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా ఒకే బైక్పై స్టంట్స్ చేసిన 8 మందిని గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అందులో కొంతమంది మైనర్లుగా గుర్తించారు. దీంతో సదరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు రోడ్లపై బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.