/rtv/media/media_files/2025/06/26/man-opens-fire-in-punjab-kapurthala-2025-06-26-19-47-37.jpg)
man opens fire in Punjab Kapurthala
పంజాబ్లోని జలంధర్-అమృత్సర్ జాతీయ రహదారి వద్ద దారుణం జరిగింది. టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలయాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జలంధర్-అమృత్సర్ నేషనల్ హైవే వద్దకు ఓ కారు వచ్చింది. దీంతో ఆ డ్రైవర్ను టోల్ట్యాక్స్ చెల్లించాలని సిబ్బంది అడిగాడు.
Also Read: ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్
కానీ ఆ వ్యక్తి కారులోంచి కిందకు దిగి సిబ్బందిపై తుపాకితో కాల్పులు జరిపాడు. దీంతో టోల్ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. చివరికి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Also Read: యాక్సియమ్-4 మిషన్ సక్సెస్.. ISSతో డాకింగ్ అయిన స్పేస్క్రాఫ్ట్