AP: ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ!
విజయదశమిని పురస్కరించుకుని మచిలీపట్నంలో ఏటా శక్తిపటాల ప్రదర్శన జరుగుతోంది. నేడు కూడా ఆ కార్యక్రమం జరుగుతుండగా రుస్తుంబాద, బలరాముని పేటకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది.పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
విజయదశమిని పురస్కరించుకుని మచిలీపట్నంలో ఏటా శక్తిపటాల ప్రదర్శన జరుగుతోంది. నేడు కూడా ఆ కార్యక్రమం జరుగుతుండగా రుస్తుంబాద, బలరాముని పేటకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది.పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
దక్షిణమధ్య రైల్వేలో లోకో పైలట్ డి.ఎబినేజర్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బిహార్కు చెందిన దేవ్ కుమార్గా గుర్తించారు. వ్యసనాలకు బానిసవడంతో డబ్బుకోసం బెదిరించేవాడు. ఎబినేజర్ని కూడా డబ్బులు అడగ్గా లేవనడంతో కొట్టి చంపేశాడు.
నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరిరోజు నిర్వహించే దుర్గమ్మ హంస వాహనం సేవను అధికారులు రద్దు చేశారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14 నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటల్ అసోయేషన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. స్విగ్గీ ప్రతినిధులతో హోటల్ యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం అవ్వడంతో బ్యాన్ను ఎత్తివేశారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం మారుమోగుతోంది.
దేశీయంగా ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95 వేల దగ్గర ఉండగా.. హైదరాబాద్లో రూ.1000 తగ్గి కేజీ వెండి రేటు రూ.1,01,900 వద్ద ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్ చేశారు. భక్తులను అదుపు చేసే క్రమంలో మహిళా భక్తురాలిపై ఓ పోలీస్ అధికారి చేయిచేసుకున్నాడు. పోలీస్ అధికారి తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని ఫైర్ అయ్యారు.
విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.
జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కూటమికి మెజార్టీ దక్కడంతో కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇదే విజయ పరంపరను కొనసాగిస్తామని పద్మశ్రీ ధీమా వ్యక్తం చేశారు.