విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్‌

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు. భక్తులను అదుపు చేసే క్రమంలో మహిళా భక్తురాలిపై ఓ పోలీస్ అధికారి చేయిచేసుకున్నాడు. పోలీస్ అధికారి తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని ఫైర్ అయ్యారు.

New Update

Vijayawada : విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు. మూలానక్షత్రం సందర్బంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తులను కంట్రోల్‌ చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు. భక్తులను అదుపు చేసే క్రమంలో మహిళా భక్తురాలిపై ఓ పోలీస్ అధికారి చేయి చేసుకున్నాడు. మహిళా భక్తుల్ని చేతులతో  పోలీసులు నెట్టేశారు. దీంతో అక్కడ కాసేపు యుద్ధ వాతావరణం కనిపించింది. పోలీస్ తీరుపై మహాళా కుటుంబ సభ్యులు సీరియస్ అయ్యారు. పోలీస్ తో వాగ్వాదానికి దిగారు.


 
భక్తులకు సరైన సౌకర్యాలను అధికారులు కల్పించలేదు. దివ్యాంగులకు వీల్‌ఛైర్లు సైతం ఏర్పాటు చేయని పరిస్థితి ఇంద్రకీలాద్రిపై కనిపిస్తోంది. ఇబ్బంది పడుతూనే భక్తులు కొండెక్కుతున్నారు. తెల్లవారుజాము నుంచి దుర్గగుడిలో విపరీతంగా రద్దీ కొనసాగుతోంది. కాగా పోలీసుల, అధికారుల తీరుపై భక్తులు ఫైర్ అవుతున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసి కూడా సరైన సదుపాయాలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.

Also Read :  మూలా నక్షత్రంలో సరస్వతి దేవీ అవతారంలో అమ్మవారు.. పోటెత్తిన భక్తులు

Advertisment
Advertisment
తాజా కథనాలు