AP Crime: వీడు కొడుకు కాదు రాక్షసుడు.. తల్లిని రోకలి బండతో కొట్టి చంపి..!
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం బాడవలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తన తల్లిని రోకలిబండతో కొట్టి చంపాడు. మృతురాలు గర్నెపూడి సీతామహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు గర్నెపూడి రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.