/rtv/media/media_files/2025/06/05/vbgqYWU5kk4NS5Z8K9xL.jpg)
Attempt to run over police with car
AP Crime : ఓ దొంగలముఠాకోసం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుహ్య సంఘటన ఎదురైంది. కరుడుకట్టిన హరియాణా దొంగల ముఠా ఒకటి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ పోలీసులను కారుతో తొక్కించేయత్నం చేసింది. దీంతో పోలీసులు వారిపైకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని కుప్పంలో కలకలం రేపింది.
Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హరియాణాకు చెందిన కరుడుకట్టిన దొంగల ముఠా ఒకటి పలు నేరాలు చేసి పారిపోతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ పార్థసారథి సూచనలతో గ్రామీణ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణగిరి - పలమనేరు జాతీయ రహదారి తంబిగానిపల్లె చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలకు పలమనేరు నుంచి తమిళనాడులోని కృష్ణగిరి వైపు కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన స్కార్పియో కారు వెళ్లడం పోలీసులు గమనించారు. కారును ఆపమని సైగ చేయడంతో ఆపారు. అయితే కారును తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించిన దొంగల ముఠా అప్రమత్తమైంది. ఇద్దరు కానిస్టేబుల్స్ కారు ముందుకు రాగానే దొంగలు కారును వెనక్కి పోనిచ్చి కానిస్టేబుళ్లపైకి ఎక్కించేందుకు యత్నించారు. అది గమనించిన పోలీసులు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.
Also Read: బెంగళూరు తొక్కిసలాట ఏ సమయంలో జరిగిందంటే..
వెంటనే తేరుకున్న గ్రామీణ సీఐ మల్లేష్ యాదవ్ వారు హరియాణా దొంగల ముఠాగా నిర్ధారించుకుని ఫైరింగ్ ఓపెన్ చేశారు. తన సర్వీసు రివాల్వర్తో కారు డ్రైవర్ తొడకు తగిలేలా ఓ రౌండ్ కాల్పులు జరిపారు. కానీ దొంగలు ఏ మాత్రం ఆగకుండా వేగంగా కారుతో సహా అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే సమీప పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసిన పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడ పట్టారు. అయితే దొంగలు వాడిన వాహనం ఆంధ్ర సరిహద్దు దాటలేదని నిర్ధారించుకున్న పోలీసులు సమీప ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పలార్లపల్లె, పరమసముద్రం, బేవనపల్లె, వడ్డిపల్లె, కుప్పం గ్రామీణ మండలం గోనుగూరు, వెండుగంపల్లె ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. పోలీసులు అనుకున్నట్లే దొంగలు పరమసముద్రం చెరువు వద్ద కారును వదిలి పారిపోయారు. సీఐ కాల్పుల్లో డ్రైవర్ గాయపడ్డాడని పోలీసులు చెబుతున్నారు. వీరు పక్కా హరియాణాకు చెందిన దొంగల ముఠాగా అనుమానిస్తున్నారు. ఈ ముఠా పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేసిందని, కారులో ఐదు మంది ఉన్నారని నిర్ధారించారు. ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని స్పష్టం చేశారు. డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించామన్నారు.
Also Read: ఇంత జనం వస్తారని ఊహించలేదు : సీఎం సిద్ధరామయ్య
Also Read: చిన్న దేశమైనా రష్యాని చిత్తు చేస్తున్న ఉక్రెయిన్.. వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్..!