ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు-PHOTOS
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పు నియోజకవర్గంలో చోటు చేసుకోవడం గమనార్హం.
కరుడుకట్టిన హరియాణా దొంగల ముఠా ఒకటి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ పోలీసులను కారుతో తొక్కించేయత్నం చేసింది. దీంతో పోలీసులు వారిపైకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని కుప్పంలో కలకలం రేపింది. పారిపోయిన దొంగల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఏపీలో కూటమి మరో సారి సత్తా చాటింది. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ పదవులు దక్కించుకుంది. గతంలో ఈ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా.. అవిశ్వాస తీర్మానాలతో ఆ పార్టీ అభ్యర్థులు పదవులు కోల్పోయారు.
స్వర్ణాంధ్ర విజన్-2047కి సంబంధించి పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చ ఎప్పారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ భాషా రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ భాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకొచ్చింది. పింఛన్లు, ఇంటిస్థలాలు ఇప్పిస్తానని లైంగికదాడి చేశాడంటూ ఓ మహిళ బహిర్గతం చేసింది.
ప్రమాదవశాత్తు ఫుట్పాత్ కుంగి మురుగుకాల్వలో పడిపోవడం వల్ల ఏపీ కుప్పానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ గల్లంతయ్యింది. విజయలక్ష్మి తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. అధికారులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె కుప్పానికి వెళ్లారు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనైనా కొట్లాడతానంటూ భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.