/rtv/media/media_files/2025/06/11/ED7J6CcKlQw2DazqNQq6.jpg)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు ఈరోజు విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే. కేసీఆర్కు మద్దతుగా హైదరాబాద్లోని BRK భవన్కు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. BRK భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. BRK మెయిన్ గేట్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ఆధోళన చేస్తున్నారు. కేసీఆర్కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. బీఆర్కే భవన్ రోడ్డును పోలీసులు పూర్తి మూసివేశారు.
Also Read : ఇండియాలో తగ్గుతున్న జనాభా..పెరుగుతున్న అవగాహన
Also Read : నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్.. BRK భవన్ లో సేమ్ సీన్ రిపీట్!
High Tension In BRK Bhavan
BRK భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..#KCR #KaleshwaramProject #Telangana #RTV pic.twitter.com/JhoMRKD6hZ
— RTV (@RTVnewsnetwork) June 11, 2025
Also Read : డ్రగ్స్ తో దొరికిపోయిన సింగర్ మంగ్లీ.. బర్త్ డే పార్టీలో భారీగా ఫారెన్ మద్యం!
వందలాది మంది పోలీసులు మెహరించారు. ఉదయం 11.30 నిమిషాలకు కేసీఆర్ అక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే ఆయన ఎర్రవల్లి ఫౌంహౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కేసీఆర్తోపాటు 9 మందిని లోపలికి అనుమతించనున్నారు. ఆయనతోపాటు హరీశ్ రావు, ప్రశాత్ రెడ్డి, కవిత లు బీఆర్కే భవన్లోనికి వెళ్లనున్నారు.
Also Read : రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. మహారాష్ట్ర పౌరులను అవమానించారన్న సీఎం
brs | hyderabad | brk-bhavan | kaleshwaram-lift-irrigation-project | cbi-enquiry-on-kaleshwaram | latest-telugu-news | justice pc ghose | Kaleshwaram Inquiry | Kaleshwaram Commission