/rtv/media/media_files/2025/06/11/Fro0D7ql97DgiBpQJPRV.jpg)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు హైదరాబాద్లోని BRK( బూర్గుల రామకృష్ణ రావు) భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైయ్యారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో రాష్ర ప్రభుత్వం విచారణకు ఆదేశంచింది. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిటీ విచారణ జరుగుతోంది.
గతంలో మాజీ సీఎం హోదాలో ఎన్టీఆర్ కూడా ఈ భవన్లో విచారణకు వెళ్లారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలో ఓ హత్యాయత్నం విచారణ కోసం నందమూరి తారక రామారావు కూడా BRK భవన్కు వచ్చారు. జస్టిస్ రాములు కమిషన్ ఆయన్ని ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో BRK భవనంలో విచారణ ఎదుర్కొన్న రెండో వ్యక్తిగా కేసీఆర్ నిలిచారు.