State Government: 30 రోజుల్లో రిజర్వేషన్లు.. 60 రోజుల్లో ఎలక్షన్స్.. స్థానిక ఎన్నికలపై సర్కార్ కీలక ప్రకటన!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పింది.

New Update
Local Body Elections

Local Body Elections

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాక 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఎన్నికల సంఘానికి ఆసక్తి కొరవడిందని పిటిషనర్లు అయిన మాజీ సర్పంచులు హైకోర్టుకు నివేదించారు. 

Also Read :  కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైన చాకలి ఐలమ్మ మనవరాలు

Also Read :  HYDలో ఇన్‌స్టా లవర్ కోసం తల్లిని చంపిన.. 10th క్లాస్ కూతురు

Local Body Elections - State Government

నల్గొండ జిల్లా తాకట్లెపల్లి మండలం పీకే మల్లేపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచి కొప్పుల పార్వతి, నల్గొండ జిల్లాలోని మరో ఐదుగురు తాజా మాజీ సర్పంచులు గ్రామ పంచాయతీ ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని కోరుతూ 2024 జనవరి 31న పిటిషన్లు దాఖలు చేశారు. సదరు పిటిషన్‌లు పలుమార్లు వాయిదాపడి సోమవారం జస్టిస్‌ టీ మాధవీదేవి ఏకసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ఇరు పక్షాల వాదనలు వినిపించారు. మరో 30 రోజుల సమయం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరారు. 30 రోజుల్లో చేసి తీరతామని, మళ్లీ గడువు పొడిగింపు అడగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు.

Also Read :  HYDలో దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారయత్నం

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించి సమ్మతి తెలియజేసిన తర్వాత 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం పంచాయతీల పదవీ కాలం పూర్తయి ఏడాదిన్నర కావొస్తోందని గుర్తు చేసింది. రీజనబుల్‌ టైం అంటే ఎంత అని ప్రశ్నించింది. పదవీకాలం ముగిసే లోపే ఎన్నికలు పెట్టాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read :  ఏపీలో ఘోరం.. కార్లు, బైక్‌లపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లో ముగ్గురు మృతి -మరో 16 మంది

 

latest-telugu-news | election-commission | chief election commissioner | high-court | local body elections telangana | local-body-elections | cm revanth on local body elections | telangana

Advertisment
Advertisment
తాజా కథనాలు